ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 2 : నాగోబా జాతర ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు. శుక్రవారం మండలంలోని నాగోబా ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో ఆమెను శాలువాతో సన్మానించారు.
ఆలయం నుంచి గోవాడ్ వరకు పర్యటించారు. జాతర ఉత్సవాలతోపాటు సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయులు శేఖర్బాబు, ఆనంద్రావ్ పాల్గొన్నారు.