ఇంద్రవెల్లి, ఆగస్టు 3 : మండలంలోని కేస్లాపూర్లో గల నాగోబా ఆలయ హుండీని బుధవారం లెక్కించారు. నాగుల పంచమి ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులు సమర్పించిన కానుకలను మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్రావ్ పటేల్ అధ్యక్షతన కేస్లాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో లెక్కించారు. రూ.1,27,460 నగదు, 250 గ్రాముల వెండి సమకూరగా, తైబజార్ ద్వారా రూ.23వేల ఆదాయం వచ్చినట్లు మెస్రం వంశీయులు తెలిపారు. కార్యక్రమంలో చిన్నూపటేల్, బాదీరావ్ పటేల్, జంగూపటేల్, దేవ్రావ్, సోనేరావ్, గణపతి, నాగ్నాథ్, షేగ్నాథ్, ఆనంద్రావ్, తుకారాం పాల్గొన్నారు.
దర్శించుకున్న భక్తులు
నాగుల పంచమిని పురస్కరించుకొని మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి జిల్లాతోపాటు పలు ప్రాంతాల నుంచి బుధవారం తరలివచ్చి నాగోబాను దర్శించుకున్నారు.