భైంసా, ఫిబ్రవరి 19 : యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో నడవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని నిర్మల్ చౌరస్తా శివాజీ చౌక్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు ఆదివారం భూమి పూజ చేశారు. అనంతరం శివాజీ శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువత దేశభక్తిని అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్, హిందూవాహిని తెలంగాణ ప్రాంత సంయోజక్ ఉప్పాల రాజన్న, ఏఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్, భైంసా డీఈ నాగేశ్వర్ రావు, నగర సంఘ్ సంచాలక్ సాధుల కృష్ణదాస్, ఛత్రపతి శివాజీ మహారాజ్ కమిటీ అధ్యక్షుడు ముష్కం రామకృష్ణ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పీ కృష్ణ, పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు భూమి పూజ
కుంటాల మండలం సూర్యాపూర్, ఓలాలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తుందన్నారు. సూర్యాపూర్లో రూ. 45 లక్షలతో కల్యాణ మండపం, ఓలాలో రూ. 5 లక్షలతో సీసీ రోడ్లు, హనుమాన్ మందిర్ వద్ద బోరు తదితర వాటికి భూమి పూజ చేశారు.
అలరించిన కుస్తీ పోటీలు
కుంటాల మండలం సూర్యాపూర్లో ఏటా మహా శివరాత్రి మరుసటి రోజు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు నిర్వహిం చడం ఆనవాయితీ. ముథోల్ నియోజకవర్గంతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్, పర్బనీ, కిన్వట్ ప్రాంతాల నుంచి మల్లయోధులు పాల్గొన్నారు. ఈ కుస్తీ పోటీలను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తిలకించి అభినందించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ గంగామణి, ఎంపీపీ గజ్జారాం, వెంకటేశ్, సర్పంచ్లు సమత, ఖనీష్ ఫాతిమా, బక్కి సునీత, బీఆర్ఎస్ నాయకులు బుచ్చన్న, భోజన్న, రమణా రావు, ప్రవీణ్, దశరథ్, సంతోష్, అశోక్ రెడ్డి, శంకర్ గౌడ్, జుట్టు మహేందర్, పడకంటి దత్తు, గజ్జా రాం, అనిల్, బుచ్చన్న, జీవీ రమణారావు, లక్ష్మణ్, ప్రవీణ్, పెంట దశరథ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం
భైంసాటౌన్, ఫిబ్రవరి 19 : మండలంలోని మాటేగాంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్వింటాలుకు రూ. 5,335లు మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తున్నదని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దేవెందర్ రెడ్డి, మార్క్ఫెడ్ డైరెక్టర్ గంగాచరణ్, డీసీసీబీ డైరెక్టర్ తూర్పాటి వెంకటేశ్, వైస్ ఎంపీపీ గంగాధర్, పీఏసీఎస్ డైరెక్టర్ చాకేటి లస్మన్న, కోఆప్షన్ సభ్యుడు గజానంద్, ఏఎంసీ మాజీ చైర్మన్ పీ కృష్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూమా రెడ్డి, నాయకులు గణేశ్ పాటిల్, సోలంకి భీంరావు, సీఈవో తానాజీ పాల్గొన్నారు.