సోన్, ఫిబ్రవరి 13 : నిర్మల్ మండలం ముఠాపూర్ పీఏసీఎస్ నూతన అధ్యక్షుడిగా బోండ్ల గంగాధర్(అక్కాపూర్ ), ఉపాధ్యక్షుడిగా రాజారెడ్డి(వెంకటాపూర్) ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, సహకార శాఖ రిజిస్ట్రార్ సాయినాథ్ తెలిపారు. చైర్మన్ మహేశ్రెడ్డి, వైస్ చైర్మన్ గంగాధర్ రాజీనామా చేయగా, సహకార శాఖ ఆదేశాల మేరకు సోమవారం ముఠాపూర్ పీఏసీఎస్ కార్యాలయం లో ఎన్నిక నిర్వహించారు. కాగా, చైర్మన్, వైస్ చైర్మన్లుగా గంగాధర్, రాజారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. సంఘంలో 13 మంది సభ్యులుండగా, 9 మంది మద్దతుతో ఎన్నికలు నిర్వహించారు. చైర్మన్కు ఎన్నికల అధికారి సాయినాథ్తో పాటు, ప్రాథమిక సహకార సంఘ కార్యదర్శి వజీర్పాషా, సిబ్బంది మోహన్ పాల్గొన్నారు.
రైతులకు అందుబాటులో ఉంటా..
రైతులకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చైర్మన్ గంగాధర్ అన్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సహకారంతో సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ను నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ మండల మాజీ కన్వీనర్ ముత్యంరెడ్డి, మంత్రి సహాయకులు నాలం శ్రీనివాస్, నాయకులు చంద్రశేఖర్, నవీన్కుమార్, గంగన్న, సుమన్, సాయేందర్, స్వామి, నారాయణ, గంగాధర్ సన్మానించారు.