చెన్నూర్, ఫిబ్రవరి 19 : పట్టణంలోని మహదేవ్ స్వీట్ షాపు యజమానికి మున్సిపాలిటీ అధికారులు సోమవారం జరిమానా విధించారు. ఆదివారం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కేక్ కొనుగోలు చేయగా, అది బూజు పట్టి కనిపించింది.
ఈ విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ అధికారులు స్వీట్ షాపులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాడైపోయిన తినుబండారాలు అమ్ముతున్నారనే విషయం బహిర్గతం కావడంతో షాపు యజమానికి మున్సిపాలిటీ అధికారులు రూ. 10 వేల జరిమానా విధించి వసూలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ రాజ్కుమార్, ఆర్ఐ నవీన్, వార్డు ఆఫీసర్ సదానందం పాల్గొన్నారు.