ఎదులాపురం, జనవరి 18 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు. ఆదిలాబాద్లోని వైటీసీలో రెండో విడుత కంటి వెలుగు ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. వైద్యధికారులు ,సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. కంటి వెలుగు శిబిరాలకు వచ్చే వారి వివరాల నమోదు, పరీక్షల నిర్వహణ అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట అదనపు డీఎంహెచ్వో సాధన, అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.
గుడిహత్నూర్, జనవరి 18 : మండలంలోని కొల్హారి గ్రామంలో ప్రారంభించనున్న కంటి వెలుగు కేంద్రాన్ని జాయింట్ డైరెక్టర్ బాబు పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ కల్పన, ఈవోపీఆర్డీ లింగయ్య, డాక్టర్ శ్యాంసుందర్ ఉన్నారు.
కంటి వెలుగును బాధ్యతగా తీసుకుందాం
బోథ్, జనవరి 18 : కంటి వెలుగును అందరూ బాధ్యతగా తీసుకోవాలని సొనాల పీహెచ్సీ డాక్టర్ నవీన్రెడ్డి అన్నారు. కంటి వెలుగు ప్రారంభం కానున్న నేపథ్యంలో మండలంలోని పొచ్చెర గ్రామంలో అధికారులు, వైద్య సిబ్బంది ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మణ్, ఎంపీవో జీవన్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జనవరి 18 : మండల కేంద్రంలో రెండో విడుత ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమానికి రావాలని మండల ప్రజాప్రతినిధులకు వైద్య సిబ్బంది బుధవారం ఆహ్వానకార్డులు అందజేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్రం ఈశ్వరీబాయి, ఎంపీపీ పోటే శోభాబాయి, జడ్పీటీసీ పుష్పలత, సర్పంచ్ గాంధారి, ఎంపీటీసీ జాదవ్ స్వర్ణలత తోపాటు ప్రజాప్రతినిధులకు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, వైద్య సిబ్బంది జాదవ్ శ్రీనివాస్, బలిరాం, జ్యోతి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
కరపత్రాలు పంపిణీ
ఇచ్చోడ, జనవరి 18 : కంటి సమస్యలు లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి ఆకుల సాగర్ సూచించారు. మండలంలోని కోకస్మన్నూర్, సాత్నంబర్ గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కంటి వెలుగుపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హరిత, హెచ్ఎస్ కవిత, ఏఎన్ఎం తులసి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
నేడు కంటి వెలుగు ప్రారంభం
భీంపూర్, జనవరి18 : భీంపూర్ మండలం కరంజి(టీ) ఉపకేంద్రంలో గురువారం ఉదయం కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమవుతుందని మాతాశిశు సంరక్షణ జిల్లా అధికారి డాక్టర్ విజయసారథి తెలిపారు. రోజుకు 300 మందికి కంటి పరీక్షలు చేస్తారని పేర్కొన్నారు.
నేరడిగొండ, జనవరి 18 : నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ఉదయం 9 గంటలకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పీహెచ్సీ వైద్యాధికారి సద్దాం తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు హాజరుకావాలని ఆయన కోరారు.