ఎదులాపురం, నవంబర్ 24 : టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు. వార్డు కమిటీ మీటింగ్లో భాగంగా గురువారం శాంతినగర్లో పట్టణ అధ్యక్షుడు అలాల అజయ్ అధ్యక్షతన నిర్వహించిన వార్డు మీటింగ్కు చైర్మన్ హాజరయ్యారు. వార్డు సమస్యలపై ప్రజలతో చర్చించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ సమస్యల పరిష్కార దిశగా కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చరవేస్తూ సోషల్ మీడియా ద్వారా మరింత పటిష్టంగా నిలవాలన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ను వార్డు కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మహిళా అధ్యక్ష, కార్యదర్శులు స్వరూపరాణి, బుడగం మమత, మైనార్టీ అధ్యక్షుడు సలీమ్, బీసీ పట్టణ అధ్యక్షుడు రమేశ్, శివ, అజయ్, తదితరులు పాల్గొన్నారు.