గోమయ వినాయక ప్రతిమలను పూజిద్దాం. పర్యావరణాన్ని కాపాడుదాం. అలాగే గోవులను రక్షించుకుంటే.. లోక రక్షణ జరుగుతుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం క్లిమామ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు అల్లోల దివ్యారెడ్డి ఆధ్వర్యంలో గోవు పేడతో తయారు చేసిన గణనాథుడి ప్రతిమలను ఆయన ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి, దివ్యారెడ్డి మాట్లాడుతూ.. గోమయంలో పూజలు చేయడం మన హిందూ సంప్రదాయం ప్రకారం అనాదిగా వస్తున్న ఆచారమని పేర్కొన్నారు. ఆరేండ్లుగా శ్రేష్ఠమైన ఆవుపేడతోపాటు ప్రకృతి సహజమైన మట్టి, వేప ఆకు, చింతగింజల పొడి, పసుపుతో వీటిని రూపొందించామని పేర్కొన్నారు.
నిర్మల్ అర్బన్, ఆగస్టు 29 : వినాయక చవితిని పురస్కరించుకొని గోమయ గణేశులను పూజిద్దామని.. పర్యావరణాన్ని రక్షించుకుందామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి పేర్కొన్నారు. క్లిమామ్ సంస్థ ఆధ్వర్యంలో గో పేడతో తయారుచేసిన గణనాథుల ప్రతిమలను సోమవారం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గోమయంతో అనేక రకాల పూజలు చేసుకోవడం హిందూ సాంప్రదాయంలో అనాధిగా వ స్తున్న ఆచారమని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని పేర్కొన్నారు. క్లిమామ్ సంస్థ ద్వారా ఆ ఆచారాలను మళ్లీ ఆచరించేలా గోమయ వినాయక ప్రతిమలను తయారు చేయించి, ఉచితంగా అందజేస్తున్నట్లు వివరించారు.
ఆరేళ్లుగా ఈ కార్యక్రమా న్ని నిర్విరామంగా చేపడుతున్నట్లు చెప్పారు. శ్రేష్టమైన ఆవు పేడ, ప్రకృతి సహజమైన మట్టి, వేప ఆకు, చింతగింజల పొడి, పసుపుతో రూపొందించామన్నారు. గోవులను సంరక్షించడంతో పాటు గోవు ద్వారా లభించే పేడతో అనేక రకాల వస్తువులను తయారు చేసి, ఉచితంగా అందజేస్తున్నామ ని వెల్లడించారు. తమ గోశాలలో లభించే ఆవు పే డతో 5వేల ప్రతిమలను తయారు చేయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మంత్రి కుటుంబ సభ్యు లు సురేందర్రెడ్డి, మురళీధర్రెడ్డి, గౌతంరెడ్డి, విజయమ్మ, వినోదమ్మ, తిరుపతిరెడ్డి, సారంగాపూర్ ఎంపీపీ మహిపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు మారుగొండ రాము, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ లు, జడ్పీటీసీలు, అల్లోల అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో..
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో తయారు చేయించిన మట్టి వినాయక ప్రతిమలను స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి అల్లోల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, అల్లోల మురళీధర్రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజి రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ధ్యాన్ చంద్ జయంతి..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధ్యన్చంద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల, హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పాకాల రాంచందర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడా యాంత్రికుడు ద్యాన్ చంద్ ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్దపీఠ వేసిందన్నారు. జిల్లా నుంచి ఎందరో రాష్ట్ర, జాతీ య స్థాయి పోటీల్లో పాల్గొని, జిల్లాకు పేరు తీసుకువచ్చారని తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులను పాకాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెమొంటో అందించి, శాలువాలతో సత్కరించారు. అనంతరం క్రీడాజ్యోతి వెలగించి, జాతీయస్థాయి క్రీడాకారులకు అందించారు. నాయకులు అయ్యన్నగారి భూమయ్య, సారంగాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వంగ రవీందర్ రెడ్డి, చనిగారపు నరేశ్, నర్సాగౌడ్, కొండ శ్రీధర్, చంద్రాగౌడ్, వెంకటేశ్వర్ రావు, పీడీలు భూమన్న, అంబాజీ తదితరులున్నారు.
కరపత్రాల ఆవిష్కరణ..
పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ప్రతిష్టించనున్న కర్రగణేశ్ విగ్రహ పూజా కార్యక్రమాలకు సంబంధించిన కరప్రతాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ, కర్ర పారిశ్రామిక సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఏడేళ్లుగా బ్రహ్మంగారి ఆలయంలో కర్ర వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా రెండేండ్లు ఆర్భాటాలకు పోకుండా సాదాసీదాగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. సంఘ నాయకులు పాల్గొన్నారు.