ఇంద్రవెల్లి, జనవరి 14 : ముగ్గులు సంప్రదాయానికి ప్రతీక అని ఎంపీపీ పోటే శోభాబాయి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని దస్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అనంతపూర్లో జై దేవి రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పార్వతిబాయి, వాటర్ షెడ్ కమిటీ సభ్యులు కోట్నాక్ పాండు, జుగాదిరావ్, విజయ్, సంతోష్, సాయినాథ్, కేశవ్, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్, జనవరి 13 : ఉట్నూర్ ఆర్టీసీ డిపోలో మహిళా కండక్టర్లకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న ఉషారాణి, వసుమతి, రాజ్యలక్ష్మి, రాజమణికి ఈ నెల 26వ తేదీన బహుమతులు అందజేస్తామని డిపో ట్రాఫిక్ ఇన్చార్జి జనార్దన్ తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగులు రతన్సింగ్, కృష్ణమూర్తి, రవి పాల్గొన్నారు.
ఇచ్చోడ, జనవరి 14 : ఇచ్చోడ, సిరికొండ మండలాల్లోని బాదిగూడ, వాయిపేట, కన్నపూర్, మణిపూర్, నిజాంగూడ గ్రామాల్లో ఆదివాసులు గోధుమపిండితో రకరకాల తీపి వంటకాలు తయారు చేసి శివపార్వతులకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలతో గ్రామస్తులు గోధుమ పిండితో తీపి ఉంగడాలు తయారు చేసి పంచుకుంటారు.
ఇంద్రవెల్లి, జనవరి 14 : సంక్రాంతి అంటేనే మహిళలకు ముగ్గుల పండుగని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి అన్నారు. మండలంలోని అంద్గూడ గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
నేరడిగొండ, జనవరి 14 : మండలంలోని తేజాపూర్ గ్రామంలో కృషి మిత్ర వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన మహిళలకు సర్పంచ్ ప్రపూల్చందర్రెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గంగామణి, ఉప సర్పంచ్ లావణ్య, నాయకులు శ్రీనివాస్రెడ్డి, సాగర్, కృషి మిత్ర యూత్ సభ్యులు అశోక్, మహేశ్, రవి, రంజిత్, బాబు, రాజు, సతీశ్, గ్రామపెద్దలు, యువకులు పాల్గొన్నారు.