మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 13 : పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రగతి సా ధ్యమవుతుందని పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ ర్ అన్నారు. గడపగడపకూ బీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్రావుతో కలిసి ప్రచారం చేశారు. పట్టణ వ్యాపారస్తులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలకు ఓ ట్లు అడిగే నైతిక హక్కు లేదని, ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల అ భ్యున్నతికి కృషి చేశామని, రైతులకు రైతుబంధు, రైతుబీమాతో భరోసానిచ్చామన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చి న హామీల అమలులో విఫలమయ్యారని మండిపడ్డారు. డిసెంబర్ 9న రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట తప్పాడని గుర్తు చేశారు. హామీలన్నీ అమలు చేశాకే ఓట్లు అడుగాలని, లేదా ప్రజలను మోసం చేశామని ఒ ప్పుకోవాలని డిమాండ్ చేశారు.
పదేళ్ల కాలం లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ విషయంలో తల్లిని చంపి బిడ్డను బతికించారని కించపరిచేలా మాట్లాడారని, ఆరు మండలాలను అన్యాయంగా తెలంగాణకు రాకుండా చేశారని, ఐటీఐఆర్, విద్యా సంస్థలు రాకుండా చేశారని మండిపడ్డారు. పంటలెండిపోయి రైతులు, గిరాకీలు లేక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం రేవంత్రెడ్డి స్పందించడం లేదని చెప్పుకొచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చి, ప్రజలనుమోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్ పాలన ఏ రకంగా ఉందో, రేవంత్రెడ్డి పాలన ఏ రకంగా ఉందో ప్రజలు బేరీజు వేసుకోవాలని, ఎవరు మంచివారో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఏం చేసిందని బీజేపీకి ఓటు వేయాలో ఆలోచించుకోవాలన్నారు. బీజేపీకి ఓటువేస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, అప్పుడు మనం ఏదైనా ప్రశ్నిస్తే జైళ్లలో పెడుతారని అన్నారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంలో నేను చేసిందేనని గుర్తుకు చేశారు.
ఇక్కడి సమస్యలు తెలిసిన వ్యక్తిగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిగా, కార్మిక నాయకునిగా, సౌమ్యుడిగా ఎంతో పేరున్న కొప్పుల ఈశ్వర్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్, మున్సిపల్ కౌన్సిలర్లు గాదెసత్యం, అంకం నరేశ్, బీఆర్ఎస్ నాయకులు విజిత్రావు, గోగుల రవీందర్రెడ్డి, తోట తిరుపతి, శ్రీపతివాసు, చంద్రశేఖర్ హండే, సుంకరి రమేశ్, తాజుద్దీన్, మందపల్లి శ్రీనివాస్, మొగిలి శ్రీనివాస్, అక్కూరి సుబ్బయ్య, గట్టయ్య, సుధీర్ పాల్గొన్నారు.
– మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు