ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కొనసాగిన వేడుకలు
ఎడ్లబండ్ల ర్యాలీలు.. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం..
భైంసా/భీంపూర్/ఖానాపూర్ టౌన్/బెల్లంపల్లి రూరల్, జనవరి 11;‘రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని.. వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందిస్తూ రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి అని’ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం కూడా రైతుబంధు సంబురాలు కొనసాగాయి. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గాంధీగంజ్, తానూర్ మండలంలోని జౌళ(బీ)లలో ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఖానాపూర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేఖానాయక్, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం కరంజి(టీ)లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని తాళ్లగురిజాలలో జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు.
ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి
భైంసా, జనవరి 11 : రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మంగళవారం రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా భైంసా పట్టణంలోని గాంధీగంజ్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాలుగేండ్లలో రైతుబంధు పథకం ద్వారా రూ. 50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని గుర్తు చేశారు. అనంతరం పలువురు రైతులను ఆయన సన్మానిచారు. ఈ కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, వైస్ చైర్మన్ ఆసీఫ్, సీనియర్ నాయకులు విలాస్ గాదేవార్, జేకే పటేల్, రమేశ్ మాశెట్టి వార్, ప్రసన్నజిత్ ఆగ్రే, తోట రాము, సీరాజొద్దీన్, భోజారాం, దత్తురాం పటేల్, మార్కెట్ కార్యదర్శి అడెల్లు పాల్గొన్నారు.
అప్పుజెయ్యకుండనే ఎవుసం..
నా పేరు చిక్రాం మారుతి. మాది ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం. గంగాపూర్ గ్రామం. మా ఊళ్లె నాకు సర్వే నం.1/A3లో మూడెకరాల భూమి ఉంది. గతంల ఎవుసం చేయాలంటే అప్పుకోసం తిరిగేటోన్ని. ఒక్కోసారి పైసలు దొరక్కపోతే చాలా బాధ అనిపించేది. నాలాగనే మా ఊళ్లె చాలామందికి ఇట్లనే ఇబ్బంది అయితుండె. అప్పులిచ్చినోళ్లు పంట పండేదాక చూసి అమ్మేటప్పుడే అత్తుండే. ధర ఎట్లున్నా ఆళ్ల బాధలకు అమ్మి పైసలు కడుతుంటిమి. ఏటా మా గోస గిట్లనే ఉండే. ఒక్కోసారి గీ వ్యవసాయం మానేసి కూలీకి పోదామనుకున్న. మా బాధలు తెలిసిన కేసీఆర్ సారు.. రైతుబంధు పథకం పెట్టిండు. ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు ఇత్తుండు. మాకు మూడెకరాలకు రూ.30వేలు ఖాతల పడుతున్నయ్. ఇప్పటిదాకా ఎనిమిది సార్లు రైతు బంధు డబ్బులు లేపిన. దీంతో అప్పులోళ్ల బాధలన్నీ పోయినయ్. గతంల సీజన్ చాలైదంటే చాలు.. వడ్డీలోళ్ల సుట్టూ తిరుగుతుంటిమి. వాళ్లు తిప్పితిప్పి ఫలానా టైంకు ఇయ్యాలేనని భయపెట్టెటోళ్లు. పంట పండినా.. పండకపోయినా డబ్బు కట్టెటోళ్లం. గిప్పుడు ఆ బాధలే లేవు. డైరెక్ట్గా మా ఖాతాలళ్లనే డబ్బులు పడుతున్నయ్. అచ్చిన డబ్బులతోటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర ఖర్చులు పెట్టుకుంటున్నం. నాకైతే సమయానికి డబ్బులు వస్తున్నయ్. అప్పుజెయ్యకుండనే పంటలు పండిస్తున్న. రైతుల గురించి ఇంతమంచిగ ఆలోచించినోళ్లు ఇప్పటి వరకు ఎవరూలేరు. గిసుంటి సీఎం ఉంటే రైతుల బతుకులు ఎందుకు బాగుపడయ్. వానకాలంల పత్తి, కంది, పెసర, మినుము, మిర్చి పంటలు వేసిన. దిగుబడి బాగానే అచ్చింది. ఈసారి వర్షాలు కూడా బాగాపడడంతో యాసంగిలో శనగ, గోధుమ, జొన్న పంటలు సాగు చేస్తున్నా. – నార్నూర్, జనవరి 11
రైతు కృతజ్ఞత ట్రాక్టర్ ర్యాలీ
బెల్లంపల్లి రూరల్, జనవరి 11 : రైతుబంధు వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం బెల్లంపల్లి మండలంలోని తాళ్లగురిజాల గ్రామం నుంచి గురిజాల రైతు వేదిక వరకు రైతు కృతజ్ఞత ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు ప్రారంభించి నట్లు జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారా యణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకు లు ఆరోపణలు చేస్తున్నారని, వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొమాస శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ సింగం గణేశ్ గౌడ్, సర్పంచ్ గాజుల రంజిత, నియోజకవర్గ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్, ఏడీఎ సురేఖ, ఏవో ప్రేమ్కుమార్, ఏఈవోలు శ్రీనివాస్, నాగదీప్తి పాల్గొన్నారు.
వ్యవసాయంలోనే ఆనందముంది..
నా పేరు జక్కుల సాగర్. మాది చెన్నూర్ మండలం కొమ్మెర గ్రామం. నేను డిగ్రీ పూర్తి చేశా. మా నాన్న సత్యనారాయణ గీత కార్మికుడు. మాకు నాలుగెకరాల భూమి ఉంది. గతంలో మా నాన్న కు వీలు కాక, పెట్టుబడు లకు డబ్బుల్లేక మా భూము లు కౌలుకు ఇచ్చినం. కేసీఆర్ సార్ పెట్టుబడికి మొదట ఒక ఎకరానికి నాలుగు వేల చొప్పున ఇచ్చిన్రు. మాకు మొత్తం రూ.16 వేలు మా నాన్న ఖాతాలో పడ్డయ్. దీంతో కౌలుకు ఇచ్చే బదులు మేమే చేసుకుం దామని నాన్నను అడిగిన. మనతోటి అయిత దా అని అన్నడు. ఇద్దరం కలిసి చేస్తే ఎందుకు కాదు అనడంతో సరే అన్నడు. నాలుగేండ్ల సంది నేనే వ్యవసాయ పనులు చూసుకుంటున్న. ఇటు చదువుకుంటూ నాన్నకు చేదోడువాదోడుగా ఉంటున్న. అప్పుడ ప్పుడు అమ్మ కూడా పనులకు అత్తుం ది. గతంల రైతులంటే అందరికీ చిన్నచూపుండే. వ్యవసాయం చేయాలంటే ఏడుపొచ్చే ది. ఒకవేళ ఎలాగోలా వ్యవసాయం చేసినా.. అప్పులోళ్ల తిప్పలు తప్పేటియ్ కావు. పంట పండంగనే పైసలు ఇయ్యుమనే టోళ్లు. దీంతో చాలా మంది రైతులు వ్యవసా యం అద్దనుకుని ఖాళీగా ఉంచిన్రు. కొందరైతే ఉన్న భూములు అమ్ముకున్నరు. రైతుల కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ సార్.. పెట్టుబడి సాయం ఇస్తుండు. మొదట రూ.4 వేలు ఇయ్యగ.. ఇప్పుడు రూ.5 వేలు ఇస్తుండడంతో మాకు రూ.20 వేలు అత్తు న్నయ్. ఈ సారి పత్తితో పాటు కూరగాయలు సాగు చేస్తున్నాం. ఆ పైసలు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర ఖర్చులకు సరిపోతున్నయ్. నాతో పాటు మా ఊర్ల యువకులు వ్యవసాయానికే ప్రాధాన్యమిస్తున్నారు. నాకు వ్యవసాయం చేయడ మంటే చాలా ఇష్టం. మా భూమిలో మేమే వ్యవసాయం చేసుకుంటుంటే సంతోషమని పిస్తున్నది. రానురానూ ప్రతి ఒక్కరూ వ్యవసాయం వైపే మొగ్గు చూపే రోజులు వస్తాయి. సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటం.
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ఖానాపూర్ టౌన్, జనవరి 11 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతుబంధు సంబురాల్లో భాగంగా రైతులు, నాయకులతో కలిసి స్థానిక శాసనసభ్యురాలు రేఖానాయక్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజేందర్, మండల, పట్టణ అధ్యక్షులు రాజగంగన్న, పరిమి సురేశ్ పాల్గొన్నారు.