లోకేశ్వరం, మార్చి 27 : భారతదేశంలో కేసీఆర్తోనే సుపరిపాలన అందుతుందని, రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విఠల్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్లో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి, దళితబంధు, వ్యవసాయానికి కరెంటు వంటివి అందుతున్నాయన్నారు. రాష్ట్ర సర్కారు ఆలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నదని, బడులను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా చేస్తున్నదన్నారు.
నిధుల కేటాయింపులో సవతితల్లి ప్రేమ చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలలో వాటా ఉందని దుష్ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, ఎంపీపీ లలితా భోజన్న, వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ డైరెక్టర్లు, నాయకులు రాజేష్ బాబు, మెండే శ్రీధర్, చిన్నారావు, కుంటాల సాగర్, సాయిరెడ్డి, బండి ప్రశాంత్, దిగంబర్, మగ్గిడి అనిల్, సుదర్శన్రెడ్డి, గంటారి రాజు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్ కార్యకర్తలతో గులాబీ మయంగా మారింది. ఆత్మీయ సమ్మేళనానికి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ప్రాంగణం కిక్కిరిసింది. ఈ సందర్భంగా జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ మాట్లాడుతూ.. కుల, మత బేధం లేకుండా అన్ని వర్గాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ఎస్టీసెల్ మాజీ జిల్లా అధ్యక్షుడు రాజేశ్బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు, పింఛన్, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ ఇలా ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని అన్నారు.