భైంసా, మే 1 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో సోమవారం భైంసా మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మక్కజొన్న రైతుకు అండగా నిలిచిందని, మక్కలు క్వింటాలుకు మద్దతు ధర రూ. 1962 చెల్లించేందుకు నిర్ణయించి భరోసా ఇచ్చిందన్నారు. గాలివాన బీభత్సంతో గత నెలలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ఎకరాకు రూ. 10 వేలు పరిహారం ప్రకటించారన్నారు. అనంతరం పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా రాజేశ్ బాబు, వైస్ చైర్మన్గా జేకే సుదర్శన్ పటేల్, డైరెక్టర్లుగా తోట రాము, రౌతు రాజేశ్వర్, రాజారెడ్డి, రాజేశ్వర్, గంగాధర్, సాయన్న, దిగంబర్ పటేల్, దేవిదాస్, గంగామణి, సుధాకర్, నాగేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరిని పలువురు సన్మానించారు. ముందుగా పట్టణంలో ద్విచక్రవాహనాలపై ర్యాలీగా బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. మహనీయుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జేకే పటేల్కు లోకేశ్వరం మండల బంజారా నాయకులు బస్టాండ్ సమీపంలో గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలోబీఆర్ఎస్ సీనియర్ నాయకులు మురళీగౌడ్, రమేశ్ మాశెట్టి వార్, సావ్లీ రమేశ్, మైసేకర్ సాయిలు, లోలం శ్యాంసుందర్, రమేశ్ మాశెట్టి వార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, ఎజాజ్ బాయ్, ప్రవీణ్ రెడ్డి, ప్రసన్నజిత్ ఆగ్రే, వాసే, ఆళా, బీఆర్ ఎస్ నాయకులు ఉన్నారు.
కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
ముథోల్, మే 1 : రైతులు మక్క కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్లోని గోదాంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో ముథోల్ సర్పంచ్ రాజేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అప్రోజ్ ఖాన్, సర్పంచ్లు రాంరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ సుదర్శన్, నాయకులు ఆరిఫ్, ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, మగ్దూం, పీఏసీఎస్ సీఈవో సాయారెడ్డి ఉన్నారు.