ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 19 : ఛత్రపతి శివాజీ మహరాజ్ ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. గురువారం ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని పురసరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివాజీ పరిపాలన, ధైర్యసాహసాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటాయన్నారు. మహనీయులను నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కోలే బికాజీ, జీవన్, కమలాకర్, బీఆర్ఎస్ నాయకులు పోటు శ్రీధర్రెడ్డి, కర్నాతం సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.