నార్నూర్, ఏప్రిల్ 20 : ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆదివారం ఇంద్రవెల్లి పర్యటనలో భాగంగా ఉట్నూర్ ఎక్స్రోడ్డు వద్ద బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు.
ఎమ్మెల్యే వెంట జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్, నార్నూర్ సహకార సంఘం ఇన్చార్జి చైర్మన్ ఆడే సురేశ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్, సర్పంచ్ల సంఘం మాజీ మండలాధ్యక్షుడు ఉర్వేత రూప్దేవ్, పార్టీ మండలాధ్యక్షుడు మెస్రం హన్మంత్రావు, మాజీ సర్పంచ్లు రాథోడ్ మధూకర్, రాథోడ్ విష్ణు, మడావి ముక్తారూప్దేవ్, నాయకులు హైమద్, సుల్తాన్ఖాన్, యశ్వంత్రావు, సయ్యద్ ఖాశీం ఉన్నారు.