సిర్పూర్(యు), జనవరి 17: మండల కేం ద్రంలోని ఐకేపీ స్త్రీనిధి భవనంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మం చి నూనె తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ బుధవారం ప్రారంభించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐటీడీఏ ద్వారా రూ. 18 లక్షల తో ఈ నూనె తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొ న్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ మిల్లు దోహ దం చేస్తుందన్నారు. ఇప్ప పరక నూనెతో పాటు వేరుశనగ, నువ్వుల నూనె తయారు చేస్తారని తెలిపారు. 200 గ్రాముల నూనె ధర రూ.150, లీటరు నూనె ధర రూ. 750 ఉం టుందని ఏపీఎం వెంకట రెడ్డి తెలిపారు. సొం త నూనె ధాన్యాలు తీసుకువస్తే కిలోకు రూ. 30 తీసుకుంటామన్నారు.
10 కిలోల ధాన్యాలకు 3.5 లీటర్ల నూనె వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ తొడసం భాగ్యలక్ష్మి, వైస్ ఎంపీపీ ఆత్రం ప్రకాశ్, సింగిల్ విండో చైర్మన్ కేంద్రె శివాజీ, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తొడసం ధర్మరావ్, సర్పంచులు ఆత్రం వీణాబాయి, పెందోర్ నాగోరావ్, ఎంపీటీసీ గేడాం సార్జాబాయి, ఎంపీడీవో మధుసూదన్, డీఆర్డీవో సురేందర్ ఉన్నారు.