కౌటాల, మే 14: ఆదివాసుల హక్కుల కోసం అ లు పెరగని పోరాటం చేసిన యోధుడు కుమ్రం భీం అని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలంలోని తుమ్డిహట్టిలో ఆదివారం కుమ్రం భీం విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆదివాసీ గిరిజనులు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఆదివాసీల కోసం ఆయన చేసిన పోరాటం వెలకట్టలేనిదన్నారు.
ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమ్రం మాంతయ్య, సర్పంచ్ పీ చరణ్ దాస్, మొగడ్ధగఢ్ ఎంపీటీసీ బొమ్మకంటి మనీశ్, మాజీ సర్పంచ్ పత్రు, ఎస్సార్పీ పోశాని, డిప్యూటీ తహసీల్దార్ పోచయ్య, మధుకర్, గిరిజన నాయకులున్నారు..