కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఒడ్డేపల్లి గార్డెన్లో గురువారం జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కాగా, 3 గంటల వరకు పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులు, కాంట్రాక్టర్ల తీరుపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్అండ్బీ ద్వారా చేపడుతున్న రోడ్ల నిర్మాణంలో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్లిస్టులో పెట్టాలని ఇది వరకు అనేక సమావేశాల్లో తీర్మానం చేసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇందుకు అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి మాట్లాడుతూ రోడ్ల నిర్మాణాల్లో కాలయాపన చేస్తున్న ఇద్దరు కాంట్లాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడుతూ తీర్మానించినట్లు తెలిపారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రంలోని ఒడ్డేపల్లి గార్డెన్లో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అధ్యక్షతన గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించగా, కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావ్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. మధ్యా హ్నం 12 గంటలకు ప్రారంభమైన సమావేశం 3 గంటల వరకు కొనసాగగా, వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, కాంట్రాక్టర్ల పనితీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొదట ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గంలో ఆర్అండ్బీ ద్వారా జరుగుతున్న రోడ్ల పను లు సంవత్సరాల కాలంగా అసంపూర్తిగా ఉంటున్నాయని, వీటి ని చేపడుతున్న కమాలొద్దీన్ అనే కాంట్రాక్టర్ సరిగా పనిచేయ డం లేదని, గతంలో నిర్వహించిన అనేక సర్వసభ్య సమావేశాల్లో ఈ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని తీర్మానం చేసినప్పటికీ ఇంతవరకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. పైగా ఇప్పుడు మళ్లీ జిల్లాలో వంతెనల నిర్మాణం కాంట్రాక్టులను అప్పగించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందవెల్లి వంతెన కూలిపోయి దాదాపు 15 రోజులు అవుతుందని, ఇంతవరకు అధికారుల బృందం దీనిని సందర్శించింది లేదని ఆరోపించారు. దీనికి అవతల 42 గ్రామాలు ఉన్నాయని, ప్రస్తుతం నీరు తక్కువగా ఉండడంతో ప్రజలు నాటుపడవలపై రాకపోకలు సాగిస్తున్నారని, వచ్చే వర్షాకాలం వస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ఆసిఫాబాద్ ఎక్స్ రోడ్ నుంచి కాగజ్నగర్ వరకు గల రోడ్డు గుంతలు పడి పూర్తిగా పాడైపోయిందని, దీనిని ఎందుకు బాగుచేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. దీనిపై అధికారులు సమాధానం ఇస్తూ ఈ రోడ్డు శాశ్వత మరమ్మతుల కోసం రూ. 8 కోట్లతో ప్రణాళికలు తయారు చేసి ఈఎన్సీకి పంపించామని, అయితే ఈ రోడ్డు మరమ్మతులకు ఈఎన్సీ నుంచి సరైన స్పందన రాలేదని, తాత్కాలికంగా రిపేర్ చేయాలని ఈఎన్సీ సూచించిందని అధికారులు తెలిపారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సభ నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. అనంతరం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ ఆసిఫాబాద్ – తిర్యాణి రోడ్డు ప్రారంభించి ఏడు సంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు పనులు పూర్తి చేయలేదని, సంబంధిత అధికారులు గడువు పెంచుతూ వస్తున్నారని ఆరోపించారు. పనులు సకాలంలో పూర్తిచేయని కాంట్రాక్టర్ కమాలొద్దీన్ను వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సభ తీర్మానం చేయాలని కోరారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన రోడ్లకు అటవీ శాఖ నుంచి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రెబ్బెన, కెరమెరి, వాంకిడి మండలాల్లో అదనపు పీహెచ్సీలను ఇవ్వాలని వైద్యశాఖ అధికారులను కోరారు.
అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే కోనప్ప
ఉత్తమ పంచాయతీల ఎంపికకు కృషి చేయాలి
జిల్లాలో ప్రస్తుతం ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపిక ప్రక్రి య జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి పనులు బాగా జరిగిన పంచాయతీల వివరాలను ఆన్లైన్లో న మోదు చేసి అవార్డుల కోసం పంపిస్తున్నాం. ఈ ప్రక్రియలో స్థానిక సం స్థల ప్రజా ప్రతినిధులు భాగస్వాము లు కావాలి. జాతీ య ఉత్తమ పంచాయతీల ఎంపిక మన జిల్లాకు, రాష్ట్రానికి కూడా మంచి పేరు తెస్తుంది. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అందరు కృషి చేయాలి. మండ ల, జిల్లా స్థాయి లో పంచాయతీలను ఉన్నతంగా తీర్చిదిద్దాలి. జాతీయ స్థాయిలో అవార్డులను పొందేలా సహకరించాలి.
– చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్
అందవెల్లి వంతెన పరిశీలనకు త్వరలో ఎక్స్పర్ట్ కమిటీ
కూలిపోయిన అందవెల్లి వంతన ను పరిశీలించేందుకు త్వరలో ని పుణుల బృందం రానున్నది. వం తెన వంగిపోయిన వెంటనే మరమ్మతుల కోసం సర్కారుకు నివేదికలు పంపాం. అంతలోనే వంతెన కూలిపోయింది. వంతెన పనికి వస్తుందా లేక కొత్తవంతెన నిర్మించాలా అనేది కమిటీ పరిశీలనలో తెలుస్తుంది. వీలైనంత త్వ రగా వంతెన సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటాం. జిల్లా కేంద్రంలో ని దవాఖానలో వైద్య సేవలు మెరుగుపరుస్తున్నాం. త్వరలోనే మెడికల్ కళాశాల అందుబాటులోకి వస్తుంది. ప్రసూతి వైద్యులను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– రాహుల్ రాజ్, కలెక్టర్
జిల్లా ప్రగతికి సహకరించాలి
జిల్లా ప్రగతికి అధికారులు సహకరించాలి. జిల్లాకు మంజూరైన రో డ్లు, వంతెనలు సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. జిల్లాలో సబ్సెంటర్ల అభివృద్ధి కోసం రూ. 7.57 కోట్ల నిధులు వచ్చాయి. వీటితో సబ్సెంటర్లలో వసతులు కల్పిస్తాం. మన ఊరు- మనబడి పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించాం. అటవీశాఖ అనుమతులు రాకపోవడం వల్ల జిల్లాలో 21 రో డ్లు పెండింగ్ ఉన్నాయి. వీటికి త్వరగా అనుమతులు వచ్చే లా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎంపీపీలు, జడ్పీటీసీ లు మండల పరిధిలో జరిగే మండల పరిషత్ సమావేశాల్లో సమస్యలపై చర్చించి పరిష్కరించుకోవాలి. రోడ్లు సకాలంలో పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్న కాంట్రాక్టర్ కమాలొద్దీన్, గుండి వంతెన కాంట్రాక్టర్ రియాజ్ను బ్లాక్లిస్ట్లో పెడుతున్నట్లు తీర్మానం చేశాం. ఇదేవిధంగా అడ పీహెచ్సీని వావుడం తరలించాలని, జాతీయ రహదారి విస్తరణలో స్థ లాలు కోల్పోయిన వారికి పక్కనే ఉన్న రైల్వే స్థలాన్ని వాడుకునేలా చర్యలు తీసుకుంటూ రైల్వేవారికి ఇతర ప్రాంతంలో మూడెకరాల రెవెన్యూ స్థలాన్ని ఇచ్చేలా తీర్మానాలు చేశాం.
– కోవ లక్ష్మి, జడ్పీ అధ్యక్షురాలు