ఎదులాపురం, నవంబర్ 27 : ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న కోరారు. సోమవారం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో పర్యటించగా ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దివ్యాంగులకాలనీ, శివాజీచౌక్, బ్రాహ్మణవాడ, కుమార్పేట్, పాత బస్టాండ్ కాలనీల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలీన వార్టుల్లో మౌలిక వసతులలు కల్పించేలా కృషి చేశామని తెలిపారు. ఓపెన్ జిమ్లు, పార్కుల ఏర్పాటుతో పాటు ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించినట్లు వివరించారు. అండర్ డ్రైనేజీ, రహదారుల నిర్మాణాలతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించి ప్రజల సమస్యలు దూరం చేసినట్లు పేర్కొన్నారు.
అన్ని వర్గాలకు అండగా నిలిచేలా బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టిందని, పథకాలు నిర్విరామంగా కొనసాలంటే కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజానీ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల్ అజయ్, నాయకులు మిషు శ్రీనివాస్, సలీంపాషా, ప్రమోద్, గందేవార్ శివకుమార్, బాదన్ గంగన్న, చిన్న పటేల్, సాగర్, రాజు,కృష్ణ పాల్గొన్నారు.
ఎదులాపురం, నవంబర్ 27 : ఓల్ బస్టాండ్ వద్ద హ్యాండిక్యాంప్ కాలనీ చెందిన ప్రమోద్కుమార్ ఆధ్వర్యంలో 100 మంది యువకులు సోమవారం ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణలో యువతకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.
ఆదిలాబాద్లో రెండు ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేసి అందులో 250 మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. పట్టణంలో రూ.40కోట్లతో నూతన ఐటీ టవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అందులో 5వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించ బడుతాయన్నారు. ఈ ఎన్నికలో యువత కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు దాసరి రమేశ్, నాయకులు శ్రీనివాస్, మిష్ణు, తదితరులు పాల్గొన్నారు.
ఎదులాపురం, నవంబర్ 27 : బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్దసంఖ్యలో పార్టీలో చేరికల పర్వం కొనసాగుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్తో పాటు గ్రామీణ ప్రాంతానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. కొడప సొనేరావ్ సొంత గూటికి చేరగా రామాయి హత్తిగుట్టకు చెందిన నాయకులుతో పాటు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ మాజీ జిల్లా అధ్యక్షుడు షేక్ కలీం, వడ్డెర కాలానికి చెందిన 100 మంది బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, నాయకులు కేతపల్లి సంతోష్, యూనిస్ అక్బానీ, రాము, తదితరులు పాల్గొన్నారు.
ఎదులాపురం, నవంబర్ 27 : బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే సకల జనులకు సంక్షేమ ఫలాలు అందుతాయని దుర్గం ట్రస్ట్ చైర్మన్ శేఖర్ అన్నారు. సోమవారం పట్టణంలోని భూక్తపూర్, గాంధీనగర్ వార్డుల్లో దుర్గం ట్రస్ట్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్లో జరిగిన అభివృద్ధిని వివరించారు. ఈ నెల 30వ తేదీన జరిగి ఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో దయానంద్ కాంబ్లే, జబడే బాబాసాహెబ్, దుర్గం నారాయణ, గంగారాం బోర్కర్, అనిల్ సాల్వే, సూరజ్ సోన్ కాంబ్లే, మహేందర్, కావేటి మోహన్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఎదులాపురం, నవంబర్ 27 : ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నాయుకులు పకడ్బందీగా కార్యచరణతో ముందుకు సాగి ఎమ్మెల్యే అభ్యర్ధి జోగు రామన్నను భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా పని చేయాలని బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు, వార్డు ఇన్చార్జి విజ్జగిరి నారాయణ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని న్యూహౌసింగ్ బోర్డు కాలనీలో కౌన్సిలర్ పవన్ నాయక్ కార్యాలయంలో 9,10,11,12,41 వార్డులకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు.
30వ తేదీన చేయాల్సిన పనులు , అంతుకు ముందు కార్యకర్తలు, పోలింగ్ బూత్ ఉన్న వారి వివరాలు తెలుసుకున్నారు. సమావేశంలో వార్డు కౌన్సిలర్ పవన్నాయక్, వార్డు ఇన్చార్జి చిలుక విలాస్, వార్డు అధ్యక్షుడు దయాకర్, వామన్, ప్రశాంత్ రెడ్డి, నాయకులు భూమన్న, మల్లేశ్, రత్నకిశోర్, అజయ్, అరవింద్, సిరాజ్, మునీర్, రాజేశ్యాదవ్, అన్వర్, కలీమ్, పటాడేరాజు, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
జైనథ్, నవంబర్ 27 : జైనథ్, గిమ్మ, కౌఠ, సావాపూర్, సాంగ్వి, లక్ష్మిపూర్, బెల్లూరి గ్రామాల్లో జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మ్యానిఫెస్టోను వివరిస్తూ జోగు రామన్న గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, సర్పంచ్లు రాధిక- సాయినాథ్, దేవన్న, విఠల్ రెడ్డి, నాయకులు గడ్డం పోతారెడ్డి, పరమేశ్వర్, రుక్మన్న, ఆనంద్రావ్, సునీల్, దాసరి రాములు, ప్రభాకర్, దత్తు, కార్యకర్తలు పాల్గొన్నారు.