ఎదులాపురం, ఆగస్టు 18 : బహుజన హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుల ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ముందుగా విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు, గౌడ సంఘం నాయకులు ఎమ్మెల్యేకు సాదరంగా స్వాగతం పలికారు. రిబ్బన్కట్ చేసిన అనంతరం, కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గౌడ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చరిత్ర భావితరాలకు తెలియజేయాలి
మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదని ఎమ్మె ల్యే జోగు రామన్న అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాడు వివి ధ ప్రాంతాల్లో జరిగిన అన్యాయాలు, అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన పాపన్న గౌడ్ సేవలు మరువలేనివన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. ఆ యన సేవలు స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జయంతి, వర్ధంతి సందర్భంగా మహనీయుల ఆశయాలు, త్యాగాలు, పోరాటాలను గుర్తుచేసుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్ తారలు స్ఫూర్తి పొందేలా వారి సేవలను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐకమత్యంతో ఉం డి అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ పా టుపడాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీబీసీడీవో రాజలింగం, గౌడ, వివిధ కుల సం ఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.