ఎదులాపురం, జూన్ 22 : అమరుల త్యాగా లు వెలకట్టలేమని, వారి త్యాగఫలంతోనే తెలంగా ణ సాధించుకున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా అమరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక తెలంగాణ చౌక్ సమీపంలో అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి, అమర వీరుల కుటుంబసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు నివాళులర్పించారు. రెండు నిమి షాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న మట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధికి కృషిచేస్తున్నామని తెలిపారు. జిల్లాలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా యంత్రాంగానికి, పోలీస్, ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి ప్రజలు, ప్రజాప్ర తినిధులు, కవులు, కళాకారులకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరులను ఎన్నటికీ మరువ లేమన్నారు. ఎందరో త్యాగధనుల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధ్దించిందని వారి జ్ఞాపకార్థం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. 21 రోజుల పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేశారన్నారు. అమరుల కుటుంబ సభ్యులను ప్రతి సంవత్సరం సత్కరించి గౌరవించుకుంటు న్నామ న్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు. జిల్లా ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి, జిల్లాలో అమరవీరుల ప్రాణ త్యాగాలు తెలంగాణ ఏర్పాటులో ముఖ్య భూమిక వహించాయని, శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య లాంటి అమరవీరుల త్యాగాలే తెలంగాణ ఏర్పాటుకు మూలం అని పేర్కొన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా పనిచేస్తుందన్నారు. అనంతరం అమర వీరుల కుటుంబ సభ్యులను, తెలంగాణ సాంస్కృ తిక సారథి కళాకారులను కలెక్టర్ శాలువా, జ్ఞాపి కలతో ఘనంగా సత్కరించారు. అలాగే తెలం గాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలోని అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్, అధికారులునివాళులర్పించారు. ఈ కార్య క్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ కమీషనర్ శైలజ, ఇన్చార్జి డీపీఆర్వో విష్ణువర్ధన్, కలెక్టరేట్ పరిపాలనాధికారి అరవింద్ కుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.