తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు సోమవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కేసీఆర్)ను మర్యాద పూర్వకంగా కలిశారు.
మొదటగా తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ అయ్యారు. అనంతరం తనను కలిసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్కు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం.