దస్తురాబాద్, ఏప్రిల్ 19 : బీఆర్ఎస్ హయాంలోనే ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన 29 కల్యాణలక్ష్మి, రూ.3 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ముస్లింలకు రంజాన్ తోఫాను ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి పంపిణీ చే శారు. అంతకుముందు మండల కేంద్రంలో దొమ్మరి సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.2 లక్షల ప్రొసీడింగ్ పత్రాన్ని అందజేశారు. మున్యాల తండాలోని భీమన్న గుడికి మట్టిరోడ్డు నిర్మాణం కోసం ఆమె భూమిపూజ చేశారు. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయని, గ్రామాల్లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పర్యటిస్తూ లేనిపోని మాటలు చెబుతున్నారని, వారి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూ చించారు. పని చేసే ప్రభుత్వాన్ని గుర్తించి, బీఆర్ఎస్ వెంట ప్రజలు ఉండాలని కోరారు. కాగా, ఎమ్మెల్యేకు వీవోఏలు వినతి పత్రం అందజేశారు.
పార్టీ బలోపేతానికి, గెలిపించడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం మనందరం కష్టపడాలని పేర్కొన్నారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్దే గెలు పు అని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ శారద-శ్రీనివాస్, ఎంపీపీ సింగరి కిషన్, వైస్ ఎంపీపీ భూక్యా రాజు నాయక్, మండల కో-ఆప్షన్ సభ్యుడు ముస్తాఫా, ఎంపీటీసీ వెడ్మా మాన్కు, దుర్గం సునీత-రాజలింగం, సర్పంచ్లు నిమ్మతోట రాజమణి-శివయ్య, దుర్గం శంకర్, ముష్కే అంజన్న, నాగావత్ సురేశ్ నాయక్, ఉప సర్పంచ్ మాణిక్యరావ్, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో విజయ్ భాస్కర్ రెడ్డి, డీటీ తెలంగ్రావు, ఆర్ఐ పీవీ నర్సయ్య, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ రాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ముడికే ఐలయ్య యాదవ్, రాజనర్సయ్య, రైతు బంధు గ్రామ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.