రెబ్బెన : సింగరేణిలోని కార్మిక కాలనీకి బెల్లం పల్లి ఏరియా జీఎం సంజీవరెడ్డి మిషన్ భగీరథ పైపు లైన్ను ప్రారంభించారు. శుక్రవారం గోలేటి టౌన్ షిప్లో జరిగిన కార్యక్రమంలో జీఎం మాట్లాడారు. సింగరేణిలోని కార్మికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి సింగరేణి యాజమాన్యం పెద్దపీట వేస్తుందన్నారు. తెలంగాణ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అమలు చేస్తున్న మిషన్ భగీరథ మంచినీటి పథకం కార్మిక క్వార్టర్లకు అందజేస్తుండడం అభినందనీయమన్నారు. ప్రతి రోజు ప్రతి కుటుంబానికి 120 కిలో లీటర్ల శుద్ధీ చేసిన మంచినీరు ప్రతి క్వార్టర్కు అందజేస్తామని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, కేంద్ర కమిటి చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంగెం ప్రకాశ్రావు, డీజీఎం(పర్సనల్) రాజేంద్రప్రసాద్, పర్సనల్ మేనేజర్ లక్ష్మణ్రావు, డీజీఎం(సివిల్) సతీశ్బాబు, ఈఈలు రాము, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.