నిర్మల్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : నిర్మల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, వారి అండదండలతో తాను మరోసారి గెలువబోతున్నానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధిష్టానం పార్టీ టికెట్ను కేటాయించినప్పటి నుంచి ప్రచారంలో దూసుకుపోతూ ప్రతిపక్షాలకు అందనంత దూరంలో ఉన్నానని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రచారం తీరు, గెలుపు అవకాశాలపై ఆయన సోమవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. నాడు డివిజన్ కేంద్రంగా ఉన్న నిర్మల్ను నేడు జిల్లా కేంద్రమైంది. నిర్మల్కు మెడికల్ కాలేజీ తీసుకొచ్చా. కొత్తగా పొన్కల్, బీరవెల్లి మండలాలను ఏర్పాటు చేసుకున్నం. సుదీర్ఘ కాలం గా పెండింగ్లో ఉన్న ప్యాకేజీ -27 పనులు పూర్తి చేసుకొని నియోజకవర్గంలోని 50 వేల ఎకరాలకు సాగునీరందించాను. వేల కోట్లతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో ఎన్నికల ప్రచారం కోసం ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
ప్రజల రెస్పాన్స్ చూస్తే తన గెలుపు ఖాయమైపోయిందనిపిస్తున్నది. నిర్మల్ ప్రజలతో తనకు సుదీర్ఘకాలం నుంచి ఉన్న అనుబంధంతో పాటు పదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలే తన గెలుపుకు నాంది కాబోతున్నాయన్నారు. ప్రతిపక్షాలు కేవలం రాజకీయ ప్ర యోజనాన్ని పొందేందుకు దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయని, ప్రజలు వాటిని నమ్మబోరన్నారు.
ఐకేఆర్ : ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతున్నది. ప్రతి గ్రామం, వార్డుల్లో ఓటర్లందరినీ నేరుగా కలుస్తున్నం. పదేళ్లుగా మంత్రి పదవిలో ఉండడం వల్ల ప్రజలతో డైరెక్టుగా సంబంధాలు ఉన్నయి. ప్రతిపక్షాల అభ్యర్థులకు నాయకులు లేరు, కార్యకర్తలు లేరు. మనతో పోలిస్తే వారి ప్రచారం 20 శాతం కూడా పూర్తి కాలేదు. ప్రచారంలో ఎక్కడికెళ్లినా బీఆర్ఎస్కే ఓటేస్తమని ప్రజలు స్పష్టం చేస్తున్నరు.
ఐకేఆర్ : ప్రచారంలో భాగంగా ఎక్కడికెళ్లినా వృద్ధులు, వితంతులు, వికలాంగులు, రైతులు కేసీఆర్ సార్ మమ్మల్ని ఆదుకున్నడు. మేము ఇంత ధైర్యంగా ఉంటున్నామంటే అది కేసీఆర్ వల్లనే అంటూ చెప్పడం సంతృప్తినిచ్చింది. లబ్ధిదారులు కేసీఆర్కు రుణపడి ఉన్నామని, కచ్చితంగా మళ్లీ సీఎంగా కేసీఆర్ ఉంటేనే మా బతుకులకు భరోసా అని చెబుతున్నారు. 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు ఇవ్వడంతో రూపాయి అప్పు లేకుండా ఆనందంగా ఉన్నామని చెప్పినప్పుడు హృదయం చలించిపోతున్నది. ప్రతి పల్లెలో చక్కని రోడ్లు, డ్రైనేజీలు, పచ్చని చెట్లతో ఒక ఆహ్లాదకర వాతావరణం ఉంది. పదేండ్లలో ఇంతగా అభివృద్ధి చేసిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు.
ఐకేఆర్ : నిర్మల్ జిల్లాను, మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం, అన్ని గ్రామాలు, పట్టణాల్లో వందల కోట్లతో అభివృద్ధి పనులు పూర్తవడంతో ప్రజలు కేసీఆర్ ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నారు. అలాగే రూ.300 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ కోసం శంకుస్థాపన చేసుకోవడం, కాళేశ్వరం 27వ ప్యాకేజీ పనులను పూర్తి చేయడం, రూ.1,200 కోట్లతో సబ్స్టేషన్ల నిర్మించుకోవడంతో నాణ్యమైన కరెంటును ఇవ్వగలుగుతున్నం. ఇవన్నీ నా జీవితంలో మర్చిపోలేని పనులు.
ఐకేఆర్ : గతంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినం. రాబోయే రోజుల్లో నిర్మల్లో ఒక ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలి. నిర్మల్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని ప్రజలకు హామీలిస్తున్నం. సీఎం కేసీఆర్ అడిగినవన్నీ నెరవేరుస్తానని హామీనిచ్చారు. రైల్వే లైన్ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానివి అన్ని గాలి మాటలే. ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వేలేన్ మంజూరు చేస్తామని చెబితే, రాష్ట్ర వాటా కింద 50 శాతం నిధులిస్తమని చెప్పి స్వయంగా సీఎం కేసీఆరే లెటర్ ఇచ్చారు.
అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. అలాగే బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ‘ప్రసాద్’ స్కీం కింద నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదు. అంతే కాకుండా కేంద్రీయ విద్యాలయం, నవోదయ పాఠశాల, సైన్స్ సెంటర్, బీడీ కార్మికుల కోసం ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరు చేయాలని కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా అతీగతీ లేకుండా పోయింది. నిర్మల్ అభివృద్ధికి నయా పైసా లాభం చేయని బీజేపీకి ఈ ప్రాంత ప్రజల ఓట్లడిగే హక్కులేదు.
ఐకేఆర్ : మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతినెల రూ.3 వేల గౌరవ భృతి ఇవ్వాలని, బీడీ కార్మికులకు కటఫ్ తేదీతో నిమిత్తం లేకుండా పీఎఫ్ నంబరున్న ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే హామీనిచ్చారు. స్థానిక యువత కోసం ఐటీ టవర్ను ఏర్పాటుకు కృషి చేస్తా. ఐటీ టవర్ ఏర్పాటైతే నిర్మల్ యువత ఇక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకోవచ్చు.
ఐకేఆర్ : పదేళ్లుగా రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉన్నాను. కరోనా సమయంలో, వరదలు వచ్చినప్పుడు, ప్రజలు ఏ కష్టాల్లో ఉన్నా ప్రజల మధ్యనే ఉన్నా. ఇక్కడి బీజేపీ అభ్యర్థి మహేశ్వర్రెడ్డి 2009-14 వరకు ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏనాడు ప్రజలకు అందుబాటులో లేడు. అమాస పున్నంకు నియోజకవర్గానికి వచ్చే మహేశ్వర్రెడ్డిని ప్రజలు సండే ఎమ్మెల్యే అని పేరు పెట్టారు. నిర్మల్ పేరిట ఇంజినీరింగ్ కాలేజీ తెచ్చుకొని అమ్ముకున్నడు. మెడికల్ కాలేజీ పెట్టి అది కూడా అమ్ముకున్నడు. మేం ప్రజల కోసం మెడికల్ కాలేజీ తెస్తే, ఆయన స్వలాభం చూసుకొని అమ్ముకున్నడు. ఆయన ఏనాడు ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. ఇక కాంగ్రేస్ అభ్యర్థి శ్రీహరిరావ్కు బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు అవకాశం ఇచ్చింది. అయినా గెలవలేదు. ఇప్పుడు కాంగ్రేస్లో చేరిండు. ఎన్నికలప్పుడు మాత్రమే నిర్మల్ ప్రజలు వీరికి గుర్తుకు వస్తారు. మళ్లీ ఎన్నికలు కాగానే పత్తాలేకుండా పోతారు. అందుకే వీరిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
ఐకేఆర్ : ఎక్కడికెళ్లినా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో బ్రహ్మాండంగా ఉందంటున్నారు. భారత దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రజలు మంచి జీవనాన్ని కొనసాగించేలా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉంది. దానిని ఎలాగైనా అమలు చేసి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తపన. సీఎం హామీ ఇచ్చారంటే తప్పకుండా అమలు చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉండబట్టే బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నరు. గత పదేళ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి, రాబోయేరోజుల్లో నిర్మల్ మరింత అభివృద్ధి సాధించాలంటే ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి మరోసారి ఆశీర్వాదించాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను.