నిర్మల్ అర్బన్, డిసెంబర్ 7 : ప్రత్యేక రాష్ట్ర ఉ ద్యమానికి కవులు, కళాకారుల పాత్ర మరిచి పోలేనిదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అ న్నారు. వెన్నెల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో బుధవారం నిర్వహించిన జిల్లా బాలోత్సవ్ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కవులు, కళాకారులకు నిలయం తెలంగాణ రాష్ట్రమని, వారందరికీ ప్రభుత్వం త గిన గుర్తింపు ఇస్తుందన్నారు. కళాకారులను అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టంచేశారు. ఈ సం దర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక, దేశభక్తి నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో ప్రతిభ కనబర్చిన చిన్నారులకు బహుమతులు అందించారు. వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్, కౌన్సిలర్ సలీం, వెన్నెల డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్ ధన్రాజ్, వెంకట్, అంబటి నారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.