మంచిర్యాల, ఖానాపూర్ నియోజకవర్గాలు గులాబీ మయమయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో, జన్నారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ సక్సెస్ అయ్యాయి. ఆయన ప్రసంగం వినేందుకు ఆయా మండలాలు, గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
జన్నారంలో మంత్రి కేటీఆర్కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలుకుతున్న ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్, చిత్రంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్.