అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బెల్లంపల్లిలోని ఐటీ కంపెనీల గురించి ప్రస్తావించి అభినందించారు. ‘’మా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్టాల పంపిణీకి పిలిస్తే పోయిన. అన్న మా దగ్గర రెండు ఐటీ కంపెనీలున్నయని చెప్పిండు. మీరు తప్పకుండా విజిట్ చేయాలన్నడు.
నేను నమ్మలే.. నిజామా అని అడిగిన. బెల్లంపల్లిలో ఒక్క ఇంజినీరింగ్ కాలేజీ కూడా లేదు.. సింగరేణి బెల్టు.. హైదరాబాద్ నుంచి బెల్లంపల్లికి 250 కిలోమీటర్లకు పై చిలుకు దూరం ఉంటుంది. అట్లాంటి బెల్లంపల్లిలో రెండు ఐటీ కంపెనీలున్నయి. ఒకటి సనాతన ఎనలిటిక్స్, వాల్యూ పిచ్.. లోకల్ పిల్లలు.. వెంకటరమణ, ఇంకో నలుగురు అన్నదమ్ములు కలిసి కంపెనీలను నడిపిస్తున్నరు. 300 మంది పిల్లలకు కొలువులు కల్పిస్తున్నరు.” అని చెబుతూ కొనియాడారు.
– బెల్లంపల్లి, ఆగస్టు 4