నిర్మల్ అర్బన్, నవంబర్ 2 : నిర్మల్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కందుల శ్రీకాంత్ మంత్రి వ్యక్తిగత సోషల్ మీడియా కన్వీనర్ అన్వేశ్కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు ఆయన తెలిపాడు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వీ సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, యువ నాయకులు అల్లోల గౌతం రెడ్డి, దేవరకోట ఆలయ చైర్మన్ ఆమెడ శ్రీధర్, నాయకులు అశోక్ పాల్గొన్నారు.