నిర్మల్ చైన్గేట్, నవంబర్, 24: విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ,న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్లోని సెయింట్ థామస్ పాఠశాలలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తున్నదని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించేలా ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ప్రోత్సహించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం 1000 ఎస్సీ,బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందని చెప్పారు. విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నామని వివరించారు. ఒక్కో విద్యార్థికి రూ. 1.25 లక్షల చొప్పన ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.
మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా నిర్మల్ జిల్లాలో 260 పాఠశాలలు 12 కేటగిరీల్లో మూడేళ్లలో అభివృద్ధి కానున్నాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్లను మంత్రి, ప్రజాప్రతినిధులు తిలకించారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సుభాష్రావు, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, డీఈవో రవీందర్రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి వినోద్కుమార్, సెక్టోరియల్ అధికారి శ్రీదేవి, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ పద్మ, పాఠశాల ప్రిన్సిపాల్ ఆంటోని, అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు.
కరదీపిక విడుదల
ఉపాధ్యాయులకు నిత్యం ఉపయోగ పడే ఉపాధ్యాయ మార్గదర్శి సంచికను కడార్ల రవీందర్, వేణుగోపాలరావు, రతన్కుమార్ కరదీపిక రూపొందించగా భూమన్న యాదవ్ పుస్తకాలను ముద్రించారు. ఈ కరదీపికను మంత్రి అల్లోల విడుదల చేశారు. అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పాల్గొన్నారు.
విద్యార్థులను అభినందించిన మంత్రి
సోన్, నవంబర్ 24 : నిర్మల్ మండలం వెంగ్వాపేట్ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన రాకెట్ ప్రదర్శనను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తిలకించి అభినందించారు.శాస్త్ర, సాంకేతిక విజ్ఞానంలో రాకెట్ల పాత్రపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులు ప్రదర్శనను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. హెచ్ఎం మేడారపు ప్రశాంత్కుమార్, ఉపాధ్యాయులు, పీఈటీ కుమ్మరి భోజన్న పాల్గొన్నారు.
చెక్కుల పంపిణీ
నిర్మల్ టౌన్, నవంబర్ 24: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో పలువురికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అందించారు. ఈనెల 25న నిర్మల్లో అర్హులైన వారికి డబుల్బెడ్రూం ఇండ్ల పట్టాలు అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, తహసీల్దార్ సుభాష్చందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.