సోన్, సెప్టెంబర్ 24 : తెలంగాణ సర్కారు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేసి బడుగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. సోన్ మండల కేంద్రంలోని మున్నూరుకాపు సంఘ భవనంలో మహిళలకు బతుకమ్మ చీరలు, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని పథకాలు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారన్నారు. కేసీఆర్ కిట్ మొదలుకొని కల్యాణలక్ష్మి వరకు ఎన్నో పథకాలను తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని పేర్కొన్నారు.
సోన్ మండలం కొత్తగా ఏర్పడిన తర్వాత మండల ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. ప్రజల అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, జడ్పీటీసీ జీవన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, టీఆర్ఎస్ పార్టీ సోన్ మండల మోహినుద్దీన్, సర్పంచ్ టీ వినోద్, ఆర్డీవో తుకారాం, తహసీల్దార్ హిమబిందు, ఎంపీడీవో సాయిరాం, ఐకేపీ ఏపీఎం గంగామణి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మహేందర్రెడ్డి, ఉప సర్పంచ్ దాసరి రాజేశ్వర్, ఎంఎసీ డైరెక్టర్లు జక్క రాజేశ్వర్, లెంక బుచ్చన్న, పీఏసీఎస్ డైరెక్టర్ దాసు, నాయకులు దాసరి శ్రీనివాస్, వెంకాయిగారి శ్రీనివాస్రెడ్డి, ప్రకాశ్రెడ్డి, సుంచు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సారంగాపూర్లో..
సారంగాపూర్, సెప్టెంబర్ 24 : మండలంలోని కరుణాకర్రెడ్డి ఫంక్షన్ హాలులో మహిళలకు మంత్రి అల్లోల బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పేద, ధనిక తేడా లేకుం డా మహిళలందరూ బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపునేలా ఏటా చీరలు అందజేస్తున్న సీఎం కేసీఆర్, మహిళలకు పె ద్దన్నలా మారారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ఖ్యాతి తెచ్చిన ఘనత ఎమ్మెల్సీ కవితదేనని పేర్కొన్నారు. ఇక్కడి అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలపై భారం మోపుతున్నదన్నారు.
గురుకులంలో తనిఖీ..
మండలంలోని జామ్ బాలికల గురుకుల విద్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, స్టోర్లో నిల్వ ఉన్న బియ్యం, గుడ్లు, నూనె, భోజనం, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజనం, మెనూపై ప్రిన్సిపాల్ రమకళ్యాణిని అడిగి తెలుసుకున్నారు. రుచికరమైన భోజనం, నాణ్యమైన విద్య అందించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ నల్లావెంకట్ రాంరెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ మాధవరావు, డీసీసీబీ డైరెక్టర్ నారాయణరెడ్డి, ఆలూర్ సోసైటీ చైర్మన్ మాణిక్రెడ్డి, వైస్ ఎంపీపీ పతాని రాధ, ఎంపీటీసీ వనజామహిపాల్, నాయకులు రాజ్మహ్మద్, శ్రీనివాస్రెడ్డి, రాంరెడ్డి, కండెల భోజన్న, ముద్రం దినేశ్, నర్సారెడ్డి, దేవిశంకర్, ఇస్మాయిల్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.