నిర్మల్ అర్బన్, మే 31 : నిర్మల్ సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవానికి ఈనెల 4న సీఎం కేసీఆర్ నిర్మల్ జిల్లాకు వస్తున్న సంద ర్భంగా సభా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాల యాన్ని, సీఎం సభాస్థలిని పరిశీలించారు.
నిర్మల్ పట్టణ శివారులోని కొండాపూర్ వద్ద గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం, బహిరంగ సభ వద్ద ముఖ్యమంత్రి వేదిక, పార్కింగ్ ఏర్పాట్ల గురించి సిబ్బందికి సూచనలు చేశారు. బీఆర్ఎస్ యువ నాయకులు అల్లోల గౌతంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్రెడ్డి, పాకాల రాంచందర్ పాల్గొన్నారు.