మంచిర్యాల జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలలోపే ఉండగా, ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు నిత్యం పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఆయా చోట్ల వివిధ పనులు చేసుకుంటున్న వారు, నిర్మానుష్యంగా ఉన్న రోడ్ల ఫొటోలను ‘నమస్తే తెలంగాణ’ చిత్రీకరించింది. వణుకు పుట్టిస్తున్న చలిలో తమ జీవిత గమనాన్ని కొనసాగిస్తున్న వివిధ వర్గాల చిత్రాలను ఒడిసిపట్టింది.
ఈ చిత్రాలు ‘మీ కోసం.. కాగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నది. గత వారం రోజుల్లోనే ఉష్ణోగ్రతలు పది డిగ్రీలు పడి పోయాయి. ఇక డిసెంబర్ మాసంలోనే పరిస్థితి ఇలా ఉంటే, రానున్న జనవరి, ఫిబ్రవరి నెలల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 10.5, ఆదిలాబాద్లో 11.6, మంచిర్యాలలో 13.0 నిర్మల్లో 12.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
– మంచిర్యాల ఫొటోగ్రాఫర్/నిర్మల్ అర్బన్, డిసెంబర్ 14