శ్రీరాంపూర్, జనవరి 7 : శ్రీరాంపూర్ ఏరి యా ఆర్కే-5గనిపై కార్మికుల రెస్ట్హాల్లో శనివారం రాత్రి దొంగతనం జరిగింది. టూల్ బాక్స్ను పగుల గొట్టి అందులోని రూ. 10 వేలతో పాటు దుస్తులు, బ్యాగులు, రూ. 1.60 లక్షల విలువైన సెల్ఫోన్లు ఎత్తుకెళ్లారు. సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు శ్రీరాంపూర్ ఎస్ఐ రాజేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం ఉదయం గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీసైదా, పిట్ కార్యదర్శి ప్రసాద్రెడ్డి, నర్సింహారావు, కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ఖాన్, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జే శంకర్రావు.
కేంద్ర ఉపాధ్యక్షుడు కలవేణ శ్యాంకుమార్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి గరిగె స్వామి దొంగతనం జరిగిన రెస్ట్ హాల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యాజమాన్యం లాకర్స్ రూం ఏర్పాటు చేయకపోవడం వల్లే తరచూ దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. ఈ ఘటనకు యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గనిపై సరైన రక్షణ లేకపోవడం వల్లే దొంగతనం జరిగిందన్నారు. కార్మికుల టూల్ రూంకు ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు నీలం సదయ్య, సమ్మయ్య, మల్లారెడ్డి, మహేందర్రెడ్డి పాల్గొన్నారు.