బోథ్, సెప్టెంబర్ 11 : జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో బోథ్కు చెందిన కే పద్మభూషణ్ ప్రతిభ చూపాడు. ఆదివారం ఫలితాలు రాగా, 1042వ ర్యాంక్ సాధించాడు. కే కిషోర్కుమార్-రచన దంపతుల కొడుకు పద్మభూషణ్, 8వ తరగతి వరకు బోథ్లోని నాగభూషణం ఉన్నత పాఠశాలలో చదివాడు. 9, 10 తరగతులు కొత్తగూడెంలోని త్రివేణి పాఠశాలలో పూర్తి చేసాడు. ఇంటర్ హైదరాబాద్లోని శ్రీచైతన్య కళాశాలలో చదివి, 976 మార్కులు తెచ్చుకున్నాడు. కాగా, పద్మభూషణ్ను తల్లిదండ్రులు, బంధువులు, తోటి విద్యార్థులు అభినందించారు.
నిర్మల్ విద్యార్థికి 1513వ ర్యాంక్..
నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్కు చెందిన జీ రిత్విక్రావు 1513వ ర్యాంక్ సాధించాడు. చంద్రశేఖర్-సౌజన్య దంపతుల కొడుకు రిత్విక్.. మూడో తరగతి వరకు గౌతమ్ మోడల్ స్కూల్లో చదివాడు. నాలుగో తరగతి వాసవి స్కూల్లో చదివాడు. ఆ తర్వాత పదోతరగతి వరకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ నవోదయ పాఠశాలలో చదివాడు. ఇంటర్ విజయవాడ ఫిట్జ్ కళాశాలలో పూర్తి చేశాడు. రిత్విక్ను తల్లిదండ్రులు, స్థానికులు అభినందించారు.Merit in Advanced Results