ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 3: దివ్యాంగులు ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్లాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం ఉట్నూ ర్ కేబీ కాంప్లెక్స్ వికాసం పాఠశాలలో శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నదని అన్నారు. పాఠశాలలో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నట్లు పీవో తెలిపారు. పాఠశాల లో 120 మంది చదువుకుంటున్నారని చెప్పారు. ఈ సందర్భంగా దివ్యాంగుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
గిరి మిల్లెట్ కేఫ్ ప్రారంభం
ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గిరి మిల్లెట్ కేఫ్ను కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ లభించే గిరి ఉత్పత్తులు, పదార్థాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులు స్వయం ఉపాధిలో రాణించాలన్నారు. దివ్యాంగులు సంఘంగా ఏర్పడి మిల్లెట్ కేఫ్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని పీవో పేర్కొన్నారు. ఐటీడీఏ ద్వారా మరింత మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించేదుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
మెగా సదరం శిబిరాన్ని వినియోగించుకోవాలి
మెగా సదరం శిబిరాన్ని వినియోగించుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి అన్నారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సీహెచ్సీ దవాఖానలో ఐటీడీఏ ఆధ్వర్యం లో మెగా సదరం శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుంచి దివ్యాంగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే సదరం సర్టిఫికెట్ తప్పకుండా తీసుకోవాలని సూచించారు. మారుమూల గ్రామాల దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా ఈ శిబిరం ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమాల్లో ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, జడ్పీటీసీ చారులత, ఎంపీపీ పంద్ర జైవంత్రావు, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, ఎస్డీసీ వెంకటేశ్వర్లు, డీడీ దిలీప్, ఓఎస్డీ కృష్ణయ్య, క్రీడల అధికారి పార్థసారథి, ఈఈ భీంరావు, ఏవో రాంబాబు, జేడీఎం నాగభూషణ్, డీపీవో ప్రవీణ్, అదనపు డీఆర్డీఏ రాథోడ్ రవీందర్,అదనపు వైద్యాధికారి మనోహర్, హెచ్వో సుధీర్, ఏపీవో శేషారావు, మర్సుకోల తిరుపతి, ప్రిన్సిపాల్, వైద్యులు, ఐకేపీ, ఈజీఎస్, వైద్య సిబ్బంది, దివ్యాంగులు పాల్గొన్నారు.