దండేపల్లి, ఫిబ్రవరి 23 : వెల్గనూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రక్షిత మేడారం జాతర అనే అంశంపై మాక్(మోడల్ జడ్పీ సమావేశం)నిర్వహించారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా, కలెక్టర్గా, అడిషనల్ కలెక్టర్గా, జడ్పీ సీఈవోగా, ఎమ్మెల్యే, ఎంపీగా, జడ్పీటీసీ సభ్యులుగా, ఎంపీపీగా విద్యార్థులు పాల్గొని మాక్ జడ్పీ సమావేశం నిర్వహించారు. జాతరలో ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు, ఆర్టీసీ బస్సులు, వివిధ వసతులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.