మంచిర్యాల అర్బన్, జనవరి 21 : మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల ద్వితీయ సమ్మేళనాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాలులో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
1975 నుంచి 1995 వరకు విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై స్నేహితులతో ఆనందంగా గడిపారు. చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. పూర్వ విద్యార్థి, మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, సురేఖ దంపతులు హాజరు కాగా, వాని ఘనంగా సన్మానించారు. గ్రూపు ఫొటోలు దిగుతూ ఆనందంగా గడిపారు.