హాజీపూర్, ఫిబ్రవరి 14 : ఉద్యోగులకు బదిలీలు సహజమేనని మంచిర్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు. డీఎల్పీవోలుగా విధులు నిర్వహించిన బదిలీపై వెళ్తున్న ప్రభాకర్రావు, ఫణీందర్ రావులను జిల్లా పంచాయతీ అధికారుల సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మూడేండ్లుగా ప్రభుత్వ పథకాలను బాగా అమలు చేశారని గుర్తు చేశారు. కాగా.. బదిలీపై జిల్లాకు వచ్చిన డీఎల్పీవోలు శ్రీమతి ధర్మారాణి, భిక్షపతిలు రాహుల్ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా పంచాయతీ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, ప్రధాన కార్యదర్శి అజ్మత్ అలీ, కోశాధికారి అలీ, అసోసియేట్ అధ్యక్షుడు అనిల్, ఉపాధ్యక్షుడు వాసు, రమేశ్, శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షుడు చంద్రమౌళి, కార్యదర్శి నరేందర్, సుమన్, పద్మనాభం, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రవణ్, పాల్గొన్నారు.
జడ్పీ సీఈవోగా వస్తున్న గణపతిని కార్యాలయ సూపరింటెండెంట్లు, సిబ్బంది శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్లు బాలకృష్ణ, సత్యనారాయణ, శ్రీనివాస్తోపాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.