ఆమె ఆత్మ విశ్వాసం ముందు శిఖరమే చిన్నబోయింది. ఏదేమైనా సరే సాధించాలన్న పట్టుదలే అత్యంత క్లిష్టతరమైన పర్వతాలను క్కిస్తున్నది. స్వంతంత్ర భారత వజ్రోత్సవాల (పంద్రాగస్టున) సందర్భంగా ఐరోపాలోనే అత్యంత ఎత్తయిన మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 14 ఏండ్లలోనే ఈ సాహసయాత్రను పూర్తి చేసిన అతి పిన్న వయస్కురాలిగా ప్రపంచ రికార్డు సాధించింది మంచిర్యాలకు చెందిన హస్వి.
మంచిర్యాల, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లోని కొంపల్లిలో నివాసముంటున్న మంచిర్యాల జిల్లాకు చెందిన వెంకట్, మాధవి దంపతుల కూతురు పులకిత హస్వి (14), అతి పిన్నవయసులో పర్వతాలను అధిరోహించి కన్నవారికి విజయానుభూతిని అందిస్తున్నది. గతేడాది సెప్టెంబర్లో ఎముకలు కొరికే చలిలో (-15) డిగ్రీల సెల్సియస్, దట్టమైన పొగమంచు, ఇబ్బందికర వాతావరణాన్ని తట్టుకుంటూ దక్షిణాఫ్రికాలోనే అత్యంత ఎత్తయిన పర్వతమైన కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించింది. హస్వి 16 గంటల పాటు నడిచింది. అలా 5,895 మీటర్ల వరకు ప్రయాణం సాగించింది. ప్రొఫెషనల్ పర్వతారోహకులు నిర్వహిస్తున్న బూట్స్ అండ్ క్రాంపాన్స్ అడ్వెంచర్ కంపెనీలో హస్వి సైల్డ్ ఇన్ఫ్లూయెన్సర్ కావడం విశేషం. చదువులోనూ ముందుండి చురుకైన విద్యార్థినిగా పేరుతెచ్చుకున్న హస్వి స్కేటింగ్లోనూ నేషనల్ పోటీల్లో పాల్గొని బహుమతులు సొంతం చేసుకుంది.
కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులో టెడెక్స్, జోష్ టాక్లో బెస్ట్ స్పీకర్గా కూడా రాణించింది. మారథాన్లో 21 కిలోమీటర్ల పరుగుపందెంలో విజయం సాధించి గర్వకారణంగా నిలిచింది. 100 కిలోమీటర్ల సైక్లింగ్, బ్యాడ్మింటన్ ఫిట్నెస్తో మొత్తం ఏడు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలనే సంకల్పంతో ముందుకు సాగింది. గత 17న యూనియన్ టెర్రిటరీలోని 6,053 మీటర్లు గల లడ్డాఖ్లోని కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. తన ప్రతిభను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై రాజ్భవన్లో అవార్డు, శాలువాతో సత్కరించింది. హస్వి అన్నయ్య హర్ష్ కూడా స్కేటింగ్లో అత్యున్నత స్థాయికి ఎదిగి నేషనల్ లెవల్ స్కేటర్గా పేరుగాంచి ఎన్నో బహుమతులను సొంతం చేసుకున్నాడు.
హస్విని అభినందిస్తున్న గవర్నర్ తమిళసై (ఫైల్)
ఎల్బ్రస్ను అధిరోహించిన పిన్న వయస్కురాలిగా ప్రపంచ రికార్డు
హైదరాబాద్లోని ఎక్స్లెన్సియా ఇన్ఫినిటమ్ పాఠశాలలో చదువుతున్న మురికి పులకిత హస్వి పంద్రాగస్టు (15.08.2022) రోజున 75వ స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఐరోపాలో అత్యంత ఎత్తయిన మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించిన అతి పిన్నవయస్కురాలిగా ప్రపంచ రికార్డు సాధించింది. సోమవారం తెల్లవారుజామున అక్కడ త్రివర్ణ పతాకం ఎగరేసింది. రష్యా- జార్జియా సరిహద్దులో, సముద్ర మట్టానికి 5,642 మీటర్ల ఎత్తున ఎల్బ్రస్ శిఖరాగ్రం ఉంది. తన బృందంతో కలిసి కేవలం 24 గంటల్లో తూర్పు, పడమర దిక్కు నుంచి గంటకు 45 కి.మీ వేగం ఉన్న గాలులకు తట్టుకొని తన లక్ష్యాన్ని ఛేదించింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశానికి గర్వకారణంగా నిలిచిన హస్వి నేటి బాలికలకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆమెతో పాటు ఆమె విజయానికి తోడ్పాడునందించిన తల్లిదండ్రులు మురికి వెంకట్, మాధవిల ప్రోత్సాహాన్ని పలువురు అభినందించారు. మార్గదర్శకురాలు.. ఆదర్శప్రాయురాలు.. మరిన్ని రికార్డులు సాధించాలనే పట్టుదలతో ఉన్న హస్వి అనుకున్నట్లుగానే వాతావరణం సమతుల్యంగా లేనప్పటికీ తాజాగా గత 17న యూనియన్ టెర్రటరీలోని 6,053 మీటర్లు గల లడ్డాఖ్లోని కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.