కాగజ్నగర్ టౌన్, డిసెంబర్ 25: పట్టణంలోని ఫాతిమా, సీఎస్ఐ, బిలివీయర్స్తో పాటు పలు చర్చిల్లో క్రిస్మస్ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఫాతిమా చర్చిలో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఫాదర్ జోబీ, మాత్యూ, జిజో, జీసన్, సిస్టర్లు పాల్గొన్నారు.
జైనూర్ మండలంలో..
జైనూర్, డిసెంబర్ 25 : మండలంలో పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పండుగ శుభకాంక్షలు తెలియజేసుకున్నారు. అలాగే ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాస్టర్ ఎలియా, బీఆర్ఎస్ జిల్లా నా యకుడు జాడి రవిందర్ తదితరులు ఉన్నారు.
బెజ్జూర్ మండలంలో..
బెజ్జూర్ , డిసెంబర్ 25 : మండలకేంద్రంతో పాటు గ్రామాల్లోని చర్చిల్లో ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్లు కట్ చేసి పంచి పెట్టారు. గోల్కొండ బేతేలు చర్చిలో పాస్టర్ లాజరస్ 50 మంది పేదలకు వస్ర్తాలను పంపిణీ చేశారు. అలాగే ఆయా చర్చిల్లో అన్నదానాలు చేపట్టారు.
వాంకిడి మండలకేంద్రంలో..
వాంకిడి, డిసెంబర్ 25 : మండలకేంద్రంలోని సమృద్ధి జీవ సహవాస చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఎంపీపీ ముండే విమలా బాయి, జడ్పీటీసీ అజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకుడు దీపక్ ముండె, మాజీ ఉప సర్పంచ్ పెంట్, చర్చి ఫాస్టర్ ప్రభాకర్, క్రైస్తవులు, యువకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన మండలంలో..
రెబ్బెన, డిసెంబర్ 25 : మండలంలో క్రిస్మస్ వేడుకలను ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చర్చిల్లో తెలంగాణ సర్కారు అందించిన దుస్తులను ప్రజాప్రతినిధులు నిరుపేద క్రైస్తవులకు అందించారు. అలాగే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం అన్నదానంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ వేముర్ల సంతోష్, పీఏసీఎస్ చైర్మన్ కార్నా థం సంజీవ్కుమార్, వైస్ చైర్మన్ రంగు మహేశ్గౌడ్, ఎస్ఐ భూమేశ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు కుందారపు శంకరమ్మ, సర్పంచ్లు పందిర్ల వినోద, ఎంపీటీసీ లావుఢ్య సాగరమ్మ, మాజీ జడ్పీటీసీ అజ్మీరా బాబురావ్, సేవాలాల్ సేనా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవినాయక్, పాస్టర్ రాజారత్నం, నాయకులు జుమ్మిడి ఆనందరావు, పందిర్ల మధునయ్య ఉన్నారు.
తిర్యాణి మండలంలో..
తిర్యాణి,డిసెంబర్ 25: మండలంలోని రోంపల్లి, గిన్నేధరి, తిర్యాణి, గంభీరావుపేట్ తదితర గ్రామాల్లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం భజన కీర్తనలు ఆలపించారు. ఆయా కార్యక్రమాల్లో పాస్టర్లు ఆనంద్, జాకోబ్, ప్రమోద్, ఏసుపాదం, పాల్డేవిడ్ క్రైస్తవులు ఉన్నారు.
కౌటాల మండలంలో..
కౌటాల, డిసెంబర్ 25 : మండలకేంద్రంతో పాటు, ఆయా గ్రామాల్లోని చర్చిల్లో కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే అన్నదానాలు నిర్వహించారు. ఆయా చోట్ల ఫాదర్లు తదితరులు పాల్గొన్నారు.