మంచిర్యాల : తెలంగాణ సంస్కృతిక సారథి ప్రముఖ గాయకుడు చింతం రాయమల్లు మృతి బాధాకరమని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాయమల్లు బుధవారం కన్నుమూశారు. రాయమల్లు భౌతిక కాయానికి ఓదెలు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ఓదెలు మాట్లాడుతూ.. రాయమల్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమ గేయాలు పాడి ప్రజల్లో ఉద్యమాన్ని ఉధృతం చేశారన్నారు. కార్యక్రమంలో డీటీఆర్వో సంపత్ కుమార్, తెలంగాణ హెడ్ కోర్డినేటర్ దయా నర్సింగ్, రచయిత సుందిల్ల రాజన్న, మామిల్ల లక్ష్మణ్,కృష్ణ,మురళి, పుప్పతి రవీందర్ కళాకారులు, రచయితలు, గాయకులు పాల్గొన్నారు.