గోదావరిఖని, డిసెంబర్ 25 : సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం వేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 26న తాను చేపట్టబోయే సింగరేణి పోరు దీక్షకు ప్రజలు, కార్మికులు, రాజకీయ, యూనియన్లకు అతీతంగా తరలిరావాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. గోదావరిఖని చౌరస్తాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. బొగ్గు బ్లాకులను వేలం వే యవద్దని, రాష్ట్ర ప్రభుత్వానికే కేటాయించాల ని సీఎం కేసీఆర్ కేంద్రానికి పలుమార్లు లేఖ లు రాసినా పెడచెవిన పెట్టిందని విమర్శించా రు. ఇటీవల ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం చేయడానికి రామగుండానికి వచ్చిన ప్రధాని మోడీ ఎన్టీపీసీ సభలో సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించబోమని చెప్పారని గుర్త చేశారు. ప్రధాని ప్రకటనతో కార్మికుల్లో ఆశలు చిగురించాయనీ, బీజేపీ నాయకులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారన్నారు.
ప్రధాని మాట ఇచ్చి నెల గడవకముందే అదా ని, రాజగోపాల్ రెడ్డిలకు బొగ్గు బ్లాక్లను కేటాయించడానికి టెండర్ల పేరిట కుట్ర పన్నారని మండిపడ్డారు. ఆ కుట్రను తిప్పికొట్టేందుకు ఉద్యమాలకు గని కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గనులను ప్రైవేటీకరిస్తే సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులవుతార ని.. హక్కులు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ కూడా టెండర్లు వే యొచ్చు కదా అంటూ బీజేపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థనా, కాంట్రాక్ట్ సంస్థనా అని ప్రశ్నించారు. గనులను వేలం వేసేందుకే ఎంఎండీఆర్ బిల్లును పార్లమెంట్లో పాస్ చేయించారని ఆరోపించా రు.
రాజస్తాన్లో లిగ్నైట్ గనులు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో ఉన్న గనులను ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలకే కేటాయించిన కేంద్రం, తెలంగాణలోని బొగ్గు గనులకు మాత్రం టెండర్లు వేసేందుకు ముందుకు వచ్చిందని మండిపడ్డా రు. బొగ్గు బ్లాకులు కాంట్రాక్టర్ల పరమైతే వారి ని తరిమికొట్టేందుకు సైతం కార్మిక వర్గం సిద్ధం కావాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అనేక సంక్షేమ పథకాలతో పచ్చగా ఉన్న తెలంగాణలో బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తున్నదని ఆరోపించారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మూల విజయారెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు పీటీ స్వామి, ఐలి శ్రీనివాస్, మారుతి, బుచ్చిరెడ్డి, దీటి బాలరాజు, తానిపర్తి గోపాల్ రావు, వంగ శ్రీనివాస్, రఫీక్, పర్లపల్లి రవి, బాల రాజ్కుమార్, తిరుపతి సంజీవ్, చెల్కలపల్లి శ్రీనివాస్, బొడ్డు రవీందర్, జేవీ రాజు, దేవరాజ్, నీరటి శ్రీనివాస్, అడప శ్రీనివాస్, కళావతి, సత్యం, తోకల రమేశ్ తదితరులున్నారు.
వేతనాలు పెంచకపోతే ఉద్యమ కార్యాచరణ
ఓసీపీల్లో పని చేసే వోల్వో డ్రైవర్లు, హెల్ప ర్లు, ఓబీ కాంట్రాక్ కార్మికులకు వెంటనే వేతనాలు పెంచాలని, లేకుంటే ఆయా యాజమాన్యాలపై ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద ర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓసీపీల్లో కాంట్రాక్టర్ల వద్ద పని చేసే వోల్వో డ్రైవర్లు, హెల్పర్లు, ఓబీ కాంట్రాక్ట్ కార్మికులకు 2015 నుంచి ఇప్పటివరకు వేతనాలు పెంచలేదన్నారు. గతంలో తాను జడ్పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి యాజమాన్యంతో చర్చలు జరుపగా.. కరోనా కారణంగా పెంచలేకపోయామని చెప్పారన్నారు. అధిక శాతం ఇతర ప్రాంతాల కార్మికులను తీసుకొచ్చి పనుల్లో నియమించుకుంటున్నారన్నారు. వెంటనే వేతనాలు పెంచకపోతే ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని స్పష్టంచేశారు.