మంచిర్యాల : జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ 2020- 21 పోటీలలో 13 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ నెల 11, 12 వ తేదీలలో ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన ఇన్స్పైర్ జిల్లా స్థాయి పోటీలలో మంచిర్యాల జిల్లా నుంచి 132 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
వీరిలో అత్యుత్తమ ప్రదర్శన, వినూత్న ఆలోచనలతో ప్రదర్శన చేసిన 13 మంది విద్యార్థులను రాష్ట్ర స్థాయి కి ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ వెంకటేశ్వర్లు తెలిపారు. వీరు త్వరలో రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొననున్నారు.