మంచిర్యాల అర్బన్, : మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం సినీనటి కీర్తి సురేశ్ అభిమానులకు ఆనందం పంచింది. ఒక ప్రైవేట్ కార్యక్రమం ప్రారంభానికి విచ్చేసిన సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. మహానటి సినిమాలో సావిత్రి పాత్రను పోషించి మెప్పించిన కీర్తిసురేశ్ తొలిసారిగా మంచిర్యాలకు వచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు మొగిలయ్య, తీన్మార్ ఫేమ్ సావిత్రి, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేశ్గౌడ్, రాజేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.