శ్రీరాంపూర్ : సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ పరిష్కరించామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి కొన్నిసంఘాలు సింగరేణి కార్మికుల హక్కులు తాకట్టు పెట్టి హక్కులు పోగొట్టాయని విమర్శించారు.సింగరేణి కాయిలా పడితే అప్పటి ప్రభుత్వం కార్మికులను బలవంతంగా బయటికి నెట్టి వేశారని, గోల్డెన్ షేక్హ్యాండ్, వీఆర్ఎస్ పెట్టి 20 వేల కార్మికులను తొలగించారని వెల్లడించారు.
బొగ్గు గనుల్లో ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ చేయడానికి జాతీయ కార్మిక సంఘాలు అంగీకరించాయని ఆరోపించారు. ఏఐటీయూసీ 8 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఒక్క శాతం కూడా లాభాలు పెంచలేదన్నారు. టీబీజీకేఎస్ 8 సంవత్సరాలుగా 16 నుంచి 29 శాతానికి లాభాల వాటా పెంచి ఇప్పించామని వివరించారు. కార్మికులు కష్టపడి సాధించుకున్న తెలంగాణాలో సీఎం కేసీఆర్ అన్ని విధాల ఆర్థిక ఫలాలు అందిస్తున్నారని చెప్పారు.
సింగరేణిలో పని చేసి రిటైర్డ్ అయి హుజురాబాద్ నియోజక వర్గంలో ఉంటున్న కార్మికులు వారి వారి గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్, టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, మంద మల్లారెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధులు వీరబద్రయ్య, ఏనుగు రవీందర్రెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి చాట్ల అశోక్, ఏరియా చర్చల ప్రతినిధి పెట్టం లక్ష్మణ్, కాశీరావు, బ్రాంచి కార్యదర్శి పానగంటి సత్తయ్య, మాజీ సర్పంచ్ గుంట జగ్గయ్య, ఉప సర్పంచ్ సిద్దం శంకర్, నాయకులు పోశెట్టి, కొలిపాక సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.