కాగజ్నగర్ రూరల్, ఆగస్టు 11: పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని కోనేరు కోనప్ప నిత్యాన్నదాన సత్రం సమీపంలో సామల సదాశివ మాస్టారు కాంస్య విగ్రహాన్ని వారి కుటుంబ సభ్యులు సామల రాజవర్ధన్, శ్రీవర్ధన్తో కలిసి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎమ్మెల్యేలు జోగు రామన్న, ఆత్రం సక్కు, భాస్కర్రావు, కోనేరు కోనప్ప, కలెక్టర్ రాహుల్ రాజ్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సదాశివ మాస్టారు తెలుగుతోపాటు, ఉర్దూ, ఆంగ్లం, హిందీ, మరాఠీ, సంస్కృత భాషలను తెలుగులోకి అనువాదం చేసి పుస్తకాలు, రచనలు చేశారన్నారు. అనంతరం చేతన ఫౌండేషన్, కోనేరు ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు 100 కుట్టు మిషన్లు, 20 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ల్యాప్ట్యాప్లు, 15 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, 12 మందికి తోపుడు బండ్లు, 15 మందికి మూడు చక్రాల బండ్లు, రోడ్డు సౌకర్యంలేని గ్రామాలకు 108 అంబులెన్స్ను అందజేశారు. కార్యక్రమంలో చీఫ్ విప్ అరికపూడి గాంధీ, జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, జడ్పీవైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, మాజీ ఎంపీ నగేశ్, అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి, నాయకులు అరిగెల నాగేశ్వర్రావు, చేతన ఫౌండేషన్ ప్రతినిధులు సురేశ్, వెంకటేశ్వర్లు, కోనేరు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కోనేరు వంశీ, తెలుగు సాహిత్య అకాడమీ సభ్యులు కటకం మధుకర్, తిరుపతయ్య, పద్మశాలీ సేవా సంఘం అధ్యక్షుడు సామల రాజయ్య, సంఘం సభ్యులు పాల్గొన్నారు.