అధికారులు అందుబాటులో ఉండి సహాయ చర్యలు చేపట్టాలి
కలెక్టర్ భారతీ హోళికేరి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్
గోదావరి, ప్రాణహిత ముంపు ప్రాంతాల్లో పర్యటన
కోటపల్లి, జూలై 23 : జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున గోదావరి, ప్రాణహిత పరీవాహక ప్రాం తాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేటకు ఎవ రూ వెళ్లవద్దని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ సూచించారు. కోటపల్లి మండలం దేవులవా డ, రాంపూర్, కొల్లూరు, అర్జునగుట్ట గ్రామాల సమీపంలో గోదావరి, ప్రాణహిత ప్రవాహంతో నీట మునిగిన పంటలను వారు పరిశీలించారు. వర్షాలు విస్తృతంగా కురుస్తుండడం, అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహం పెరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రాణహిత నదిని నాటుపడవల సహాయంతో దాటి వెళ్లకూడదని సూచించారు. మండలంలోని తుంతుంగ చెరువు వద్ద వరద ప్రవాహాన్ని తెలుసుకున్నారు. వరదలు తగ్గుముఖం పట్టేవరకు పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వరద ప్రాంతాల సహాయార్థం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, 08736-250201కి కాల్ చేసి సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్ రావ్, రైతుబం ధు సమితి మండల కన్వీనర్ గుర్రం రాజన్న, పీఏసీఎస్ చైర్మ న్ పెద్దపోలు సాంబాగౌడ్, ఏవో మహేందర్, ఏఈవో శేఖర్, సర్పంచ్లు గోనె సత్యనారాయణ, పానెం శంకర్, మండల నాయకులు పిల్లి సమ్మయ్య, పడాల శ్రీనివాస్, గాదె శ్రీనివాస్, ఆసంపల్లి సంపత్, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి నివేదిస్తా : ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్
భారీ వర్షాలతో కోటపల్లి, చెన్నూర్ మండలాల్లో జరిగిన వరద ముంపు నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిస్తానని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ పేర్కొన్నారు. రైతులు సాగు చేస్తున్న పంటలు గోదావరి, ప్రాణహిత నది ప్రవాహంతో నీట మునగడంతో ఈ ప్రాంత ప్రజలు నష్టపోయారన్నారు. జరిగిన న ష్టాన్ని ప్రభుత్వానికి నివేదించి రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురవడంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయన్నారు. ప్రజల ను ఆదుకునేందుకు తనవంతు సాయం చేస్తానన్నారు.
రైతులు ఆందోళన చెందవద్దు..
చెన్నూర్ రూరల్, జూలై 13 : చెన్నూర్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తం గా ఉండాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి సూచించారు. సరస్వతీ ( అన్నారం) బ్యారేజ్ 45 గేట్లు ఎత్తి అధికారులు నీటిని వదిలిపెట్టారు. దీంతో దిగువన ఉన్న గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. సుందరశాల, నర్సక్కపేట, ముత్తరావుపల్లి, పొక్కూ ర్, నాగాపూర్ గ్రామాల శివార్లలో ఉన్న పంట పొలాలు, పత్తి చేన్లు నీట మునిగాయి. వీటిని శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందకూడదని భరోసా కల్పించారు. నీట మునిగిన పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేసి, రైతులకు నష్ట పరిహారం అందే లా చూస్తామని తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆమె పేర్కొన్నారు. పంటల నష్టం సర్వే చేయాలని ఏవో మహేందర్కు సూచించారు. ఆమె వెంట త హసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మల్లేశం, ఎస్ఐ వినోద్, స ర్పంచ్ రాజమల్లు, ఏఎంసీ చైర్మన్ చల్ల రాంరెడ్డి ఉన్నారు.
వరద ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్
హాజీపూర్, జూలై 23 : జిల్లా కేంద్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలైన కాలేజీ రోడ్డు, ఎన్టీఆర్ నగర్, రాంనగర్ ప్రాంతాలను కలెక్టర్ భారతీ హోళికేరి పరిశీలించారు. వరద పరిస్థితిపై మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి, మంచిర్యాల తహసీల్దార్ పిన్న రాజేశ్వర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్, రెవెన్యూ అధికారులతో పాటు మంచిర్యాల సీఐ ముత్తి లింగయ్య, తదితరులున్నారు.