జన్నారం, సెప్టెంబర్ 23: జాతీయ పులుల గణనను ప్రత్యక్ష, పరోక్ష పద్ధతిలో పకడ్బందీగా గుర్తించాలని ఎఫ్డీపీటీ వినోద్కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని అటవీశాఖ టీడీసీ సెంటర్లో గురువారం నిజామాబాద్, ఆదిలాబాద్ కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ సర్కిళ్లలో పనిచేస్తున్న డీఎఫ్వో, ఎఫ్డీవో, రేంజ్ అధికారులు, డీఆర్వోలు, సెక్షన్ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. పులుల గణనపై ఎఫ్డీపీటీ వినోద్కుమార్ పలు సూచనలు చేశారు. అనంతరం ఎఫ్డీవో మాధవరావు శిక్షణ తరగతులను కొనసాగించారు. పులులు, శాఖాహార, మాంసాహార జంతువులను తమ వద్ద గల ప్రత్యే మొబైల్ యాప్లో డౌన్లోడ్ చేసుకొని ప్రజెంటేషన్ చేయలేనివారికి వీడియో ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్వో శివానీ డోంగ్రే, వివిధ జిల్లాల అధికారులు పాల్గొన్నారు.