నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 22 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు-మన బడి, మన బస్తీ కార్యక్రమంలో ఎంపిక చేసిన పాఠశాల్లో సత్వరం మౌలిక వసతులు కల్పించాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో మన ఊరు-మన బడి కింద ఎంపిక చేసిన పాఠశాలల పురోగతిపై నిర్మల్ కలెక్టరేట్లో గురువారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 705 పాఠశాలలుండగా, మొదటి విడు తలో 260 పాఠశాలలను ఎంపిక చేసినట్లు చెప్పా రు. ఈ పాఠశాలలకు రూ.30 లక్షల చొప్పున మొదటి విడుతలో నిధులు మంజూరు చేయగా.. రెండో విడుతలో రూ.50లక్షల విలువ చేసే పనులున్న పాఠశాలలకు త్వరలో నిధులు విడుదల చేస్తామని వివరించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎంపికైన పాఠశాలలో జిల్లా కలెక్టర్తో పాటు డీఈవో సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులు, ఎస్ఎంసీ చైర్మన్లు పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. పాఠశాలల్లో అవసరమైన తరగతి గదుల పునరుద్ధరణ, తాగునీరు, విద్య, ప్రహారీ, మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి రోజు వారీగా ప్రత్యేక యాప్లో నమోదు చేయాలని సూచించారు. రోజువారీగా జరుగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా మానిటరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మన ఊరు- మన బడి కింద ఎంపికైన పాఠశాలల్లో ఇప్పటికే 70 శాతం పనులను పూర్తి చేశామని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ విద్యాశాఖ కార్యదర్శికి వివరించారు. చేపట్టిన అభివృద్ధి పనులపై వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ తదితర వివరాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దేశంలో ఇటువంటి కార్యక్రమం ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదని తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టే పనులను నిత్యం ప్రత్యేక యాప్లో ఆన్లైన్ రిపోర్టు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఈవో రవీందర్రెడ్డి, రాష్ట్ర బృంద సభ్యులు దేవసేన ఉన్నారు.
సోన్ ప్రాథమిక పాఠశాల పరిశీలన
సోన్, సెప్టెంబర్ 22 : సోన్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం పరిశీలించారు. పాఠశాలకకు మన ఊరు-మన బడి కింద మంజూరైన నిధులు, చేపట్టాల్సిన పనులు తదితర అంశాలపై ఆరా తీశారు. పాఠశాలకు మంజూరైన రూ.30లక్షలతో పనులను నాణ్యతగా చేపట్టాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పీఆర్ ఈఈ శంకరయ్య, తహసీల్దార్ హిమబిందు, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్రెడ్డి, సర్పంచ్ టీ వినోద్, ఉప సర్పంచ్ రాజేశ్వర్ ఉన్నారు.
మన ఊరు- మన బడి కింద చేపడుతున్న పనులకు సంబం ధించి నిధుల కొరత లేదని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమా వేశం నిర్వహించారు. జిల్లాలో మన ఊరు- మన బడి కింద చేపట్టిన పనుల పురోగతి పై సంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తయిన పనులకు సంబంధించి నివేదికలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. కార్యదర్శికి కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. జాయింట్ సెక్రటరీ హరిత, జేడీ వెంకట సర్సమ్మ, అడిషల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రమేశ్ అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, డీఈవోప్రణీత, హెచ్ఎంలు పాల్గొన్నారు.